విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ సారి సంచలనం చోటు చేసుకోనుందా? ఇక్కడ నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. గౌరవంగా పక్కకు తప్పుకోవాల్సిందేనా? ఎన్నికలకు ముందుగానే ఇక్కడ విజయం ఖరారైపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ నుంచి రంగంలోకి దిగనున్న యువ నాయకుడు, బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్.. వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు.
“అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనేది మాకు అనవసరం. మాకు ఆది నుంచి అండగా ఉన్న అవినాష్ బాబుకే మాఓటు” అని స్థానికులు కుండబద్దలు కొడుతున్నారు. ఇక, కొండ ప్రాంతాలైన గిరిపురం, మాచవరంలోని కుటుంబాలు కూడా.. ఇదే మాట అంటున్నాయి. “మేం ఏన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఇంటి పట్టాలు ఇప్పించాడు. ఆయన కలలు నెరవేర్చాడు. మాకు కుళాయిలు ఇప్పించాడు. ఆయనకే మా ఓటు” అని ఇక్కడి కొంత ప్రాంత వాసులు నిక్కచ్చిగా చెబుతున్నారు.
ఇక, సెంట్రల్ నియోజకవర్గం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది.. ఆటోనగర్. ఇక్కడ నిత్యం కొన్ని వందల వాహనాలు రిపేర్లు అవుతాయి. కొత్తవి కూడా తయారవుతాయి. ఇక్కడి వారి ఆలోచన కూడా.. అవినాష్కు పాజిటివ్గానే ఉండడం గమనార్హం. “మేం ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తాం. మాకు గతంలో మరుగుదొడ్ల సదుపాయం లేదు. అవినాష్ బాబు పర్యటనకు వచ్చినప్పుడు చెప్పాం. మర్నాడే పనులు ప్రారంభించారు. అంతేకాదు.. మాకు రోడ్లు కూడా వేయించారు” అని ఆటోనగర్లో ఉండే లారీల యజమా నులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
మరోవైపు.. అనినాష్ గెలుపునకు మరో కీలక కారణం.. వయసు ఫ్యాక్టర్. ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను వృద్ధుడిగా చిత్రీకరించడంలో అవినాష్ సక్సెస్ అయ్యారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది కూడా నిజమేనని అంటున్నారు. ఎందుకంటే.. ఏకార్యక్రమానికీ ఇటీవల కాలంలో గద్దె రావడం లేదు. పైగా.. తనకు ఒంట్లో బాగోలేదని చెబుతున్నారు. దీంతో ఆయన వయసు అయిపోయింది.. ఈ సారి నాకు ఓటేయాలని చెబుతున్న అవినాష్ ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా చేరుతున్నాయి. ఇక, యువత ఓట్లు ఎలాగూ.. కలిసి రానున్నాయి. పైగా.. తన తండ్రి నెహ్రూ సన్నిహితులు, మిత్రులు కూడా.. ఎలానూ ఉన్నారు. వెరసి.. ఆయన వయసు.. వ్యూహం వంటివి గెలుపును కాదు.. మెజారిటీపైనే అంచానలు పెంచుతుండడం గమనార్హం.
This post was last modified on February 18, 2024 7:51 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…