Political News

‘5 ఏళ్లు గుడ్డి గుర్రాల‌కు ప‌ళ్లు తోమారా?’

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ ష‌ర్మిల ఫైరయ్యారు. హైద‌రాబాద్‌ను మ‌రో రెండు సంవ‌త్స‌రాల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిని చేయాలంటూ.. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన ష‌ర్మిల‌.. రెండేళ్ల పాటు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధానిగా కోర‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.

‘ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా ? రాష్ట్రానికి రాజ‌ధానిని నిర్మించ‌డం చేతకాక ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? ఐదేళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా’ అని నిప్పులు చెరిగారు. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ గ‌డువు తీరిపోతున్న ద‌రిమిలా.. ఇప్పుడు కొత్త వివాదాన్ని తెర‌మీదికి తెచ్చి.. పాత స‌మ‌స్య‌ల‌ను మ‌రుగున ప‌డేయాల‌న్న కుట్ర ఉంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక ప్యాకేజీ లేవు. పోలవరం పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు.

అప్పులు ఏం చేశారు?

జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన అప్పుల పైనా ష‌ర్మిల వ్యాఖ్య‌లు సంధించారు. “జ‌గ‌న‌న్న హ‌యాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారు. అభివృద్ధి చూపలేదు .ప్రధాని మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు” అని విమ‌ర్శించారు. 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే పరిస్థితి నెలకొందని.. దీనికి వైసీపీ నాయ‌కులు సిగ్గు ప‌డాల‌ని తీవ్ర‌స్థాయిలో మాట‌లు పేల్చారు.

This post was last modified on February 15, 2024 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago