ఏపీ సీఎం జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. హైదరాబాద్ను మరో రెండు సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిని చేయాలంటూ.. వైసీపీ కీలక నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన షర్మిల.. రెండేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కోరడాన్ని తప్పుబట్టారు.
‘ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా ? రాష్ట్రానికి రాజధానిని నిర్మించడం చేతకాక ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? ఐదేళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా’ అని నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు తీరిపోతున్న దరిమిలా.. ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరమీదికి తెచ్చి.. పాత సమస్యలను మరుగున పడేయాలన్న కుట్ర ఉందని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక ప్యాకేజీ లేవు. పోలవరం పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు.
అప్పులు ఏం చేశారు?
జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల పైనా షర్మిల వ్యాఖ్యలు సంధించారు. “జగనన్న హయాంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారు. అభివృద్ధి చూపలేదు .ప్రధాని మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు” అని విమర్శించారు. 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే పరిస్థితి నెలకొందని.. దీనికి వైసీపీ నాయకులు సిగ్గు పడాలని తీవ్రస్థాయిలో మాటలు పేల్చారు.
This post was last modified on February 15, 2024 2:34 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…