పార్టీలోని ప్రత్యర్ధులకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లేనా ? తాజా డెవలప్మెంట్లు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతు మరో పదేళ్ళ పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్ళు కూడా తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తంచేశారు. అంటే మొత్తం 20 ఏళ్ళపాటు తానే ముఖ్యమంత్రిగా ఉండాలని రేవంత్ బలంగా కోరుకుంటున్నట్లు అర్ధమవుతోంది. నిజానికి బతికున్నంత కాలం తామే పదవుల్లో ఉండాలని కోరుకోని నేతలు ఎదరూ ఉండరు.
ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేదే పదవుల కోసం. ప్రజాసేవని చెప్పటం కేవలం పడికట్టు పదం మాత్రమే. ఈ విషయం చెప్పేవారికీ తెలుసు, ఓట్లేసే జనాలకు కూడా బాగా తెలుసు. ఇపుడు విషయం ఏమిటంటే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని రేవంత్ కోరుకోవటం పార్టీలో పెద్ద చర్చయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎంతకాలం పదవుల్లో ఉంటారో అధిష్టానం మీద ఆధారపడుంటుంది. ఎంతటి బలవంతుడైన నేతయినా అధిష్టానం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే తప్ప వేరే దారిలేదు.
అసలు రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీయే విచిత్రంగా జరిగింది. టీడీపీలో ఉన్నపుడు కాంగ్రెస్ ను నూరుశాతం వ్యతిరేకించిన రేవంత్ చివరకు అదే కాంగ్రెస్ లో చేరక తప్పలేదు. పార్టీలోకి రేవంత్ ను చేర్చుకోవటాన్ని చాలామంది సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తెరవెనుక జరిగిన లాబీయింగ్ కారణంగా రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. అప్పటినుండి ప్రతి విషయంలోను ప్రతి అడుగులోను రేవంత్ ను సీనియర్లు వ్యతిరేకిస్తునే ఉన్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి ప్రెసిడెంట్ అయినపుడు కూడా సీనియర్ల అలాగే వ్యతిరేకించారు. చివరకు ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. అంటే రేవంత్ కు అడుగడుగునా సీనియర్ల నుండి ఏ స్ధాయిలో వ్యతిరేకత ఎదురవుతున్నదో అర్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పడి కొత్త కాబట్టి సీనియర్లు మౌనంగా ఉన్నారు. మంత్రివర్గంలోని సీనియర్లలో దాదాపు తొమ్మిది మంది నూరుశాతం వ్యతిరేకులే అనటంలో సందేహంలేదు. ఇలాంటి స్ధితిలో రాబోయే 20 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తాను ఉన్నంత వరకు సీఎం పోస్టు మీద ఆశలు వదులుకోమని సీనియర్లకు వార్నింగ్ ఇచ్చినట్లేనా ?
This post was last modified on February 15, 2024 11:54 am
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…