Political News

ఈసారి కడప జిల్లా రాజకీయమే వేరు

రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోను త్రిముఖ పోటీ తప్పదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. అలాంటి నియోజకవర్గాలు కడప జిల్లాలోనే ఎక్కువగా ఉండబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబంది అని ముద్రపడిపోయింది. ఇలాంటి కుటుంబంలో అన్న జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మల మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకోగానే కడప జిల్లాపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

దీని ప్రకారమే కడప మాజీ ఎంఎల్ఏ, మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరారు. అలాగే బద్వేలు మాజీ ఎంఎల్ఏ కమలమ్మ కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇక టీడీపీ నేత విజయజ్యోతి కాంగ్రెస్ లో చేరారు. ఇలాంటి వివిధ నియోజకవర్గాల్లోని కొందరు కాంగ్రెస్ పాత కాపులు మళ్ళీ యాక్టివ్ అయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బద్వేలులో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ సుధే పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అలాగే టీడీపీ తరపున రోషన్న పోటీ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అంటే రెండు ప్రధాన పార్టీల తరపున అభ్యర్ధులు ఎవరో తేలిపోయింది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తామే అభ్యర్ధులమని వీళ్ళిద్దరు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక తేలాల్సింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎవరనే. హస్తంపార్టీ తరపున కమ్మలమ్మా లేకపోతే విజయజ్యోతి పోటీలో ఉంటారా అన్నది తేలటంలేదు. ఇద్దరిలో ఎవరు పోటీలోకి దిగినా పోటీ మాత్రం మంచి పట్టుమీదుంటుందనటంలో సందేహంలేదు.

ఎందుకంటే మాజీ ఎంఎల్ఏ కమలమ్మ, సీనియర్ నేత విజయజ్యోతి ఇద్దరికి నియోజకవర్గంలో పట్టుంది. కాబట్టి బద్వేలులో పోటీ రసవత్తరంగా జరిగే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. వైసీపీ ఒంటరిగాను, జనసేన మద్దతుతో టీడీపీ రంగంలోకి దిగుతుంటే కాంగ్రెస్ కూడా ఒంటరిగానే దిగుతోంది. మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో జరిగినట్లుగా ఎలక్షన్ వార్ వన్ సైడ్ మాత్రం కాదని అర్ధమవుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on February 12, 2024 4:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వార్ 2 వెనక్కు తగ్గదు – హృతిక్ మాట

నిన్న కూలీ విడుదల తేదీని ఆగస్ట్ 14 అని ప్రకటించాక ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఈ వార్త హాట్…

35 minutes ago

ఎన్సీసీకి హైకోర్టు…ఎల్ అండ్ టీకి అసెంబ్లీ

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ఇక శాశ్వత భవనాల నిర్మాణానికి రంగం సిద్ధమైపోయింది. గతంలో అసెంబ్లీ, హైకోర్టుల నిర్వహణ కోసం తాత్కాలిక…

56 minutes ago

వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కు టులెట్ బోర్డు!

ఏపీ రాజధాని పరిధి అమరావతిలోని తాడేపల్లిలో సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన వైసీపీ కేంద్ర కార్యాలయం నిజంగానే మొన్నటిదాకా కళకళలాడింది. దాదాపుగా…

2 hours ago

‘వ‌క్ఫ్’ బిల్లు.. ఇక‌, సుప్రీం వంతు.. బిహార్‌లో అల‌జ‌డి!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు తీసుకు వ‌చ్చిన వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు-2024 పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ఆమోదం పొందింది.…

7 hours ago

రాహుల్ చేతికి ర‌క్త‌పు మ‌ర‌క‌లు: కేటీఆర్

బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ…

9 hours ago

‘జాక్’కు అడ్డం పడుతున్న ఆ డిజాస్టర్

ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం…

9 hours ago