రాబోయే ఎన్నికల్లో కొందరు సీనియర్ తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో సూపర్ సీనియర్ల కుటుంబాల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు చెప్పేశారు. సీనియర్ తమ్ముళ్ళు చింతకాయల, జేసీ, పరిటాల, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలు రెండు టికెట్ల కోసం బాగా ప్రయత్నిస్తున్నారు. జనసేనతో పొత్తులోనే టీడీపీ పోటీచేయబోయే సీట్లు తగ్గిపోతున్నాయి. తాజా డెవలప్మెంట్లలో బీజేపీ కూడా చేరుతుందనే అంటున్నారు. ఒకవేళ కమలంపార్టీ కూడా పొత్తులో చేయికలిపితే టీడీపీ పోటీచేయబోయే సీట్లు మరిన్ని తగ్గిపోతాయి.
ఒకవైపు పోటీచేయబోయే సీట్లు తగ్గిపోతుండగా మరోవైపు సీనియర్ నేతలు కుటుంబానికి రెండు టికెట్లు తీసుకుంటే మిగిలిన నేతల్లో అసంతృప్తి తప్పదని చంద్రబాబు గ్రహించారు. అందుకనే సూపర్ సీనియర్ తమ్ముళ్ళ కుటుంబాల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇస్తానని చెప్పేశారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం అసెంబ్లీకి, కొడుకు చింతకాలయ విజయ్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ అడుగుతున్నారు. పరిటాల సునీత రాప్తాడులోను కొడుకు శ్రీరామ్ కు ధర్మవరంలోను టికెట్ కావాలని పట్టుబడుతున్నారు.
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనకు కర్నూలు ఎంపీగాను, భార్య సుజాతమ్మకు ఆలూరు ఎంఎల్ఏగా టికెట్ అడుగుతున్నారు. పోయిన ఎన్నికల్లో వీళ్ళిద్దరు పై స్ధానాల్లో పోటీచేసి ఓడిపోయారు. కేఈ ప్రతాప్ లేదా కేఈ ప్రభాకర్ డోన్ అసెంబ్లీ టికెట్ తో పాటు కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యాంబాబు పత్తికొండ సీటును ఆశిస్తున్నారు. అలాగే పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం ఎంఎల్ఏగా, కూతురు అదితికి విజయనగరం ఎంఎల్ఏగా టికెట్లు కేటాయించాలని అడుగుతున్నారు. జేపీ కుటుంబంలో జేసీ పవన్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి అనంతపురం ఎంపీ, తాడిపత్రి ఎంఎల్ఏ టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు.
ఇన్ని కుటుంబాలకు రెండేసి టికెట్లిస్తే మిగిలిన నేతలు ఊరుకోరని చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందుకనే ముందుజాగ్రత్తగా శనివారం సమావేశంలో కుటుంబానికి ఒక్క టికెట్టే అని కచ్చితంగా చెప్పేశారట. మరి మిగిలిన సీట్లను ఇతర సీనియర్లకు కేటాయిస్తారా లేకపోతే పొత్తులో జనసేన, బీజేపీలకు ఇచ్చేస్తారా అన్నది సస్పెన్సుగా మారింది. చివరకు ఏమిచేస్తారో చూడాలి.
This post was last modified on February 11, 2024 12:58 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…