వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు అందునా ఏపీ సీఎం జగన్కు సోదరీమణులు తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ.. ఒకరు తర్వాత.. ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాలుగు రోజుల కిందట తన ప్రాణాలకు హాని తలపెడతున్నారంటూ.. దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సైబరాబాద్ పోలీసులకు ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన తండ్రి హత్య కేసులో అలుపెరుగని పోరాటం చేస్తున్నానని.. తనను లేపేస్తామంటూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారని సునీత పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇక, తాజాగా సీఎం జగన్ సోదరి షర్మిల కూడా తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భద్రతను తగ్గించారని, పెంచమన్నా పెంచడం లేదని..ఈ పరిణామాలు గమనిస్తే.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. “నాకు భద్రత కల్పించకపోవడం అంటే.. నా చెడును కోరుకుంటున్నారనేగా అర్థం” అని అన్నారు. ఏపీలో తాను రాజకీయంగా తిరుగుతున్నానని.. తనకు భద్రత కల్పించడం.. రాష్ట్ర సర్కారు బాధ్యతని షర్మిల వ్యాఖ్యానించారు. కానీ, తాను కోరుతున్నా.. భద్రతపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
“ఒక మహిళనని కూడా చూడకుండా, ఒక పార్టీకి అధ్యక్షురాలిననే గౌరవం కూడా లేకుండా అవమానిస్తున్నారు” అని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా?” అని షర్మిల నిలదీశారు `’మీకు సెక్యూరిటీ, మీ పెద్ద కోటలో మీరు ఉంటే సరిపోతుందా?’ అని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. కాగా, ఇటీవల ఏపీ డీజీపీకి ఆమె వరుస లేఖలు రాశారు. తన పర్యటనలో భద్రత కల్పించాలని కోరారు. ఇక, పార్టీ సీనియర్ నాయకుడు.. రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజులు కూడా షర్మిలకు భద్రత కల్పించాలని.. కోరుతూ లేఖలు రాసిన విషయం తెలిసిందే.
This post was last modified on February 7, 2024 7:28 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…