Political News

మొన్న సునీత‌.. నేడు ష‌ర్మిల‌

వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌లు అందునా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సోద‌రీమ‌ణులు త‌మ ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ.. ఒక‌రు త‌ర్వాత‌.. ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. నాలుగు రోజుల కింద‌ట త‌న ప్రాణాల‌కు హాని త‌ల‌పెడతున్నారంటూ.. దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సైబ‌రాబాద్ పోలీసులకు ఆమె లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. త‌న తండ్రి హ‌త్య కేసులో అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నాన‌ని.. త‌న‌ను లేపేస్తామంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని సునీత పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

ఇక‌, తాజాగా సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కూడా త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న భ‌ద్ర‌త‌ను త‌గ్గించార‌ని, పెంచ‌మ‌న్నా పెంచ‌డం లేద‌ని..ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. “నాకు భ‌ద్ర‌త‌ కల్పించకపోవడం అంటే.. నా చెడును కోరుకుంటున్నారనేగా అర్థం” అని అన్నారు. ఏపీలో తాను రాజ‌కీయంగా తిరుగుతున్నాన‌ని.. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డం.. రాష్ట్ర స‌ర్కారు బాధ్య‌త‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. కానీ, తాను కోరుతున్నా.. భ‌ద్ర‌త‌పై ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు.

“ఒక మహిళన‌ని కూడా చూడకుండా, ఒక పార్టీకి అధ్యక్షురాలిన‌నే గౌరవం కూడా లేకుండా అవమానిస్తున్నారు” అని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పోస్టుల‌పై ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “ఈ ప్ర‌భుత్వానికి, ఈ పాల‌కుల‌కు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా?” అని ష‌ర్మిల నిల‌దీశారు `’మీకు సెక్యూరిటీ, మీ పెద్ద కోటలో మీరు ఉంటే సరిపోతుందా?’ అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అని ప్ర‌శ్నించారు. కాగా, ఇటీవ‌ల ఏపీ డీజీపీకి ఆమె వ‌రుస లేఖ‌లు రాశారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరారు. ఇక‌, పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ర‌ఘువీరా రెడ్డి, గిడుగు రుద్ర‌రాజులు కూడా ష‌ర్మిల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని.. కోరుతూ లేఖ‌లు రాసిన విష‌యం తెలిసిందే.

This post was last modified on February 7, 2024 7:28 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

53 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago