వైఎస్ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు అందునా ఏపీ సీఎం జగన్కు సోదరీమణులు తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ.. ఒకరు తర్వాత.. ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాలుగు రోజుల కిందట తన ప్రాణాలకు హాని తలపెడతున్నారంటూ.. దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సైబరాబాద్ పోలీసులకు ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన తండ్రి హత్య కేసులో అలుపెరుగని పోరాటం చేస్తున్నానని.. తనను లేపేస్తామంటూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారని సునీత పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇక, తాజాగా సీఎం జగన్ సోదరి షర్మిల కూడా తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భద్రతను తగ్గించారని, పెంచమన్నా పెంచడం లేదని..ఈ పరిణామాలు గమనిస్తే.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. “నాకు భద్రత కల్పించకపోవడం అంటే.. నా చెడును కోరుకుంటున్నారనేగా అర్థం” అని అన్నారు. ఏపీలో తాను రాజకీయంగా తిరుగుతున్నానని.. తనకు భద్రత కల్పించడం.. రాష్ట్ర సర్కారు బాధ్యతని షర్మిల వ్యాఖ్యానించారు. కానీ, తాను కోరుతున్నా.. భద్రతపై పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
“ఒక మహిళనని కూడా చూడకుండా, ఒక పార్టీకి అధ్యక్షురాలిననే గౌరవం కూడా లేకుండా అవమానిస్తున్నారు” అని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా?” అని షర్మిల నిలదీశారు `’మీకు సెక్యూరిటీ, మీ పెద్ద కోటలో మీరు ఉంటే సరిపోతుందా?’ అని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. కాగా, ఇటీవల ఏపీ డీజీపీకి ఆమె వరుస లేఖలు రాశారు. తన పర్యటనలో భద్రత కల్పించాలని కోరారు. ఇక, పార్టీ సీనియర్ నాయకుడు.. రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజులు కూడా షర్మిలకు భద్రత కల్పించాలని.. కోరుతూ లేఖలు రాసిన విషయం తెలిసిందే.
This post was last modified on February 7, 2024 7:28 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…