Political News

అక్షరాస్యతలో దిగజారిన ఆంధ్ర

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా రెండో ఏడాది కూడా అగ్ర స్థానంలో నిలవడం గురించి పెద్ద చర్చే జరుగుతోంది రెండు రోజులుగా. దీని తాలూకు క్రెడిట్ కోసం ఇటు అధికార వైకాపా, అటు ప్రతిపక్ష టీడీపీ పార్టీలు కొట్టేసుకుంటున్నాయి. చివరికి తేలిందేమంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన ర్యాంకు ఇదని.

దాన్ని బట్టి చూస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు సర్కారుకే చెందాలి. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు ఈ రెండు పార్టీలూ కొట్టేసుకోవడానికి ఇంకో టాపిక్ దొరికింది. దేశం మొత్తంలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతంలో ఎన్నో వెనుకబడ్డ రాష్ట్రాలున్నాయి. వాటన్నింటినీ వెనక్కి నెట్టి ఏపీ ఈ జాబితాలో అట్టడుగున నిలవడం దారుణమైన విషయం.

జాతీయ అక్షరాస్యత శాతం సగటు 77.7 శాతంగా ఉండగా.. ఏపీలో అక్షరాస్యత రేటు 66.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. గతంలో ఈ జాబితా విడుదల చేసినపుడల్లా బీహార్ అట్టడుగున కనిపించేది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాక ఎంతో పురోగతి సాధించిన ఆ రాష్ట్రం ఇప్పుడు 72.8 శాతం అక్షరాస్యతతో ఏపీని వెనక్కి నెట్టి పైకి వెళ్లింది. తెలంగాణ 70.9 శాతం అక్షరాస్యతతో ఏపీ కన్నా కొంచెం మెరుగ్గా.. చివరి నుంచి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రం అయిన అసోం 85.5 శాతం అక్షరాస్యతతో జాతీయ సగటును దాటి మెరుగైన స్థానంలో నిలిచింది. ఎప్పట్లాగే కేరళ 96.2 శాతం అక్షరాస్యతతో అగ్ర స్థానం దక్కించుకుంది.

ఇంతకీ ఈ లెక్కలు ఎప్పటివో చెప్పలేదు కదా. 2017-18 వార్షిక సంవత్సరం నాటివి. అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే. దీనికి బాధ్యత ముందున్న ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సిందే కానీ.. దీన్ని బట్టి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అక్షరాస్యత శాతం పెంచడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదని స్పష్టమవుతోంది. మరి ఈ విషయంలో నిరుడు అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు పనితీరు ఎలా ఉందన్నది భవిష్యత్తులో వెల్లడయ్యే జాబితాల్ని బట్టి తెలుస్తుంది.

This post was last modified on September 7, 2020 7:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

10 minutes ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

6 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

6 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

10 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

13 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

14 hours ago