Political News

షర్మిల వెంట సునీత.. జగన్ కు మరో తలనొప్పి

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు మరో రెండు నెలలకు వచ్చేసిన నేపథ్యంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో అదే పనిగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల వెంట నడిచేందుకు వైఎస్ వివేకానంద కుమార్తె సునీత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలు హోదాలో సొంత జిల్లా కడపకు చేరుకుంటున్న షర్మిలతో.. సునీత భేటీ అవుతారని చెబుతున్నారు. ఈ రోజు ఇడుపులపాయ వేదికగా మారనుంది. ఈ భేటీ పూర్తిగా రాజకీయపూరితమని చెబుతున్నారు. తన తండ్రి వివేకానంద హత్యపై సునీత ఒంటరి పోరు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డాక్టర్ గా పేరున్న సునీత.. తన తండ్రి మరణానికి కారణమైన వారి మీద ఒత్తిళ్లను లెక్క చేయకుండా పోరు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆమె పోరాటంలో భాగంగా ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలు ఉన్నారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి మాత్రం బెయిల్ రావటంతో బయట ఉన్నారు. దీనిపై సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు కోరిన అనంతరం ముఖ్యమంత్రి జగన్.. సునీత ఫ్యామిలీల మధ్య సంబంధాలు దెబ్బ తినటం తెలిసిందే.

ఈ తరుణంలో తమకు జరిగిన అన్యాయం మీద గళం విప్పేందుకు సునీత సిద్దంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం తాను ఒక్కరే పోరు చేస్తున్న సునీత.. ఈ అంశంపై మరింత బలాన్ని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి.. సునీత చేసిన న్యాయపోరాటానికి షర్మిల తనవంతు సాయం చాలానే చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు షర్మిల వెంట సునీత చేరటం ద్వారా తమ బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. నిప్పుకు గాలి తోడైతే అన్న చందంగా.. తాజా భేటీతో ఏపీ రాజకీయాల్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు తెర లేవనుందని చెప్పక తప్పదు.

This post was last modified on January 29, 2024 11:40 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

20 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

1 hour ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

4 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

11 hours ago