గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఎప్పుడూ.. ఆ పార్టీ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేసింది లేదు. పైగా బాధపడిందీ లేదు. మాజీ మంత్రులు కేటీఆర్ నుంచి హరీష్రావు వరకు అందరూ.. పెద్దగా దీనిపై స్పందించింది ఎప్పుడూ లేదు. కేవలం స్పీడు బ్రేకులు మాత్రమే పడ్డాయని వ్యాఖ్యానించారు. అదే క్రమంలో తాజాగా మరోసారి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిర్విరామంగా 24 ఏళ్లుగా పనిచేసిన కారుకు ఇప్పుడు చిన్నపాటి సర్వీసింగ్ మాత్రమే వచ్చిందన్నారు.
కారు తిరిగి పుంజుకుంటుందని.. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 14 నియోజ కవర్గాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులు కేవలం స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయారని వ్యాఖ్యానించారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే తమకు తక్కువ పోల య్యాయని చెప్పారు. తామేమీ నిరాశ చెందడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలా విజయం దక్కించుకోవాలన్న విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయం తమదేనని అన్నారు.
“ఆయన మేనేజ్మెంట్ కోటాలో వచ్చారు” అని సీఎం రేవంత్ పై కేటీఆర్ సటైర్లు వేశారు. “మాణిక్కం ఠాకూరుకు 50 కోట్లు ఇచ్చి… మేనేజ్మెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యాడని అనుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు. తమ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని.. ఆరోపణలు కాదు.. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కాబట్టి.. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్ రువ్వారు. 39 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామన్న కేటీఆర్.. పోయింది అధికారం మాత్రమేనని పోరాట పటిమ కాదని అన్నారు.
This post was last modified on January 28, 2024 9:46 pm
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…