Political News

24 ఏళ్ల త‌ర్వాత‌.. కారుకు చిన్న స‌ర్వీసింగ్ అంతే: కేటీఆర్

గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ఎప్పుడూ.. ఆ పార్టీ నాయ‌కులు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేసింది లేదు. పైగా బాధ‌ప‌డిందీ లేదు. మాజీ మంత్రులు కేటీఆర్ నుంచి హ‌రీష్‌రావు వ‌ర‌కు అంద‌రూ.. పెద్ద‌గా దీనిపై స్పందించింది ఎప్పుడూ లేదు. కేవలం స్పీడు బ్రేకులు మాత్ర‌మే ప‌డ్డాయ‌ని వ్యాఖ్యానించారు. అదే క్ర‌మంలో తాజాగా మ‌రోసారి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో నిర్విరామంగా 24 ఏళ్లుగా ప‌నిచేసిన కారుకు ఇప్పుడు చిన్న‌పాటి స‌ర్వీసింగ్ మాత్ర‌మే వ‌చ్చింద‌న్నారు.

కారు తిరిగి పుంజుకుంటుంద‌ని.. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 14 నియోజ క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులు కేవలం స్వ‌ల్ప మెజారిటీతోనే ఓడిపోయార‌ని వ్యాఖ్యానించారు. అదే విధంగా అధికారంలోకి వ‌చ్చిన‌ కాంగ్రెస్‌ పార్టీ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే త‌మ‌కు త‌క్కువ పోల య్యాయ‌ని చెప్పారు. తామేమీ నిరాశ చెంద‌డం లేద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న విష‌యంపై క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌న్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని అన్నారు.

“ఆయ‌న మేనేజ్‌మెంట్ కోటాలో వ‌చ్చారు” అని సీఎం రేవంత్ పై కేటీఆర్ స‌టైర్లు వేశారు. “మాణిక్కం ఠాకూరుకు 50 కోట్లు ఇచ్చి… మేనేజ్‌మెంట్ కోటాలో ముఖ్య‌మంత్రి అయ్యాడ‌ని అనుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు. త‌మ హ‌యాంలో అవినీతి జరిగింద‌ని ఆరోపిస్తున్నార‌ని.. ఆరోప‌ణ‌లు కాదు.. ఇప్పుడు ప్ర‌భుత్వం మీ చేతిలోనే ఉంది కాబ‌ట్టి.. విచార‌ణ చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ సవాల్ రువ్వారు. 39 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామన్న కేటీఆర్.. పోయింది అధికారం మాత్రమేనని పోరాట పటిమ కాదని అన్నారు.

This post was last modified on January 28, 2024 9:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago