ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతున్న సంగతి తెలిసిందే. కానీ సంక్షేమ పథకాల విషయంలో, జనాలకు అవసరాన్ని బట్టి ఆర్థిక సాయాలు ప్రకటించడంలో జగన్ సర్కారు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు.
కరోనా విజృంభణ నేపథ్యంలో కొన్ని నెలల కిందట పాజిటివ్గా తేలి కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండి చికిత్స తీసుకునే వాళ్లకు రూ.2 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కొంత కాలం పాటు చెప్పినట్లే ఆర్థిక సాయం అందించారు కూడా. కానీ తర్వాత ఆ సాయానికి బ్రేక్ పడింది.జులై నుంచే కరోనా బాధితులకు ఈ సాయం అందడం లేదని వెల్లడైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏపీలో నెల రోజులుగా రోజుకు అటు ఇటుగా పది వేల కేసుల దాకా నమోదవుతున్నాయి. అంటే సాయం కింద రోజుకు రూ.2 కోట్ల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఐతే రాష్ట్రంలో ఎంతకీ కేసులు తగ్గకపోవడంతో ఈ భారాన్ని మోయడం కష్టమైపోతోంది.
కేసులు వందల్లో నమోదవుతున్నపుడు బాగానే సాయం అందించారు కానీ.. ఏకంగా రోజూ పది వేల స్థాయికి వెళ్లిపోవడంతో నిధుల విడుదలకు ఇబ్బంది వచ్చింది. ఏప్రిల్, మే , జూన్ నెలల్లో మాత్రమే ఈ సాయం అందజేశారు. ఇందుకోసం రాష్ట్ర ఆర్ధిక శాఖ దాదాపు 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.
జులై నుంచి సాయం ఆగిపోయింది. కొంచెం ఆలస్యంగా అయినా డబ్బులొస్తాయని ఆశించిన కరోనా బాధితులకు నిరాశ తప్పలేదు. కరోనా బాధితులకు చెల్లింపులు చేయలేమని జిల్లా స్థాయిలో అధికారులకు ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…