ఒకప్పుడు ఆ దేశంలో రోజుకు ఇన్ని కేసులట.. ఈ దేశంలో ఒకే రోజు ఇన్ని మరణాలట అని చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మన గురించి ఆందోళనకరమైన వార్తలు ప్రపంచం చెప్పుకుంటోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
ఈ ఉద్ధృతి ఎప్పుడు ఆగుతుందో ఏమో తెలియట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. మొత్తంగా దేశం పరిస్థితి చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. తాజాగా భారత్ కరోనా వ్యాప్తిలో మరింత ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో కొన్ని రోజుల కిందటే మూడో స్థానానికి చేరుకున్న భారత్.. ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకింది. బ్రెజిల్ (41.23 లక్షల కేసులు) ను వెనక్కి ఇండియా రెండో స్థానానికి చేరుకుంది.
భారత్లో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 41.97 లక్షలు. మరణాల సంఖ్య 71 వేల మార్కును దాటేసింది. బ్రెజిల్తో పోలిస్తే ఇండియా జనాభా చాలా ఎక్కువే. కానీ ఆ దేశంతో పోలిస్తే మన దగ్గర చేస్తున్న కరోనా పరీక్షల సంఖ్య తక్కువ. అయినా సరే.. బ్రెజిల్ను దాటేసి రెండో స్థానానికి చేరింది భారత్.
ప్రస్తుతం ఒక్క అమెరికా మాత్రమే భారత్ కంటే ముందుంది. ఆ దేశంలో 64.45 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న టాప్-10 దేశాల్లో అతి తక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్న దేశాల్లో భారత్ది రెండో స్థానం.
ఇక ఒక్క రోజు వ్యవధిలో 90 వేలకు పైగా కేసులతో భారత్.. 24 కేసుల్లో అత్యధిక కేసులు బయటపడ్డ దేశంగా ప్రపంచ రికార్డు నెలకొల్పడం గమనార్హం.
This post was last modified on September 7, 2020 8:50 am
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…