Political News

జగన్..నాది సీమ రక్తం: చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీలేరులో తాజాగా నిర్వహించిన సభలో సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం దగ్గర పడిందని, వైసీపీకి కౌంటర్ మొదలైందని చంద్రబాబు అన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేది గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక భీమిలిలో ఈ రోజు జగన్ మొదలుపెట్టబోతున్న ‘సిద్ధం’ సభపై కూడా చంద్రబాబు స్పందించారు.

ఎన్నికలు వస్తేనే ప్రజల్లోకి జగన్ వస్తారని, సంపూర్ణ మద్య నిషేధంపై మాట తప్పిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు విమర్శించారు. అబద్దాలలో జగన్ పిహెచ్డి చేశారని, పది రూపాయలిచ్చి 100 దోచుకోవడమే జగన్ విధానమని ఎద్దేవా చేశారు. ఇలాంటి జలగ మనకు వద్దని, వై నాట్ పులివెందుల అంటూ జగన్ ను ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు జగన్ కు అభ్యర్థులు దొరకడం లేదని చురకలంటించారు. తమ కసినంత జగన్ పై చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు.

వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి జనాన్ని మోసం చేసిన జగన్ అధికార అహంకారాన్ని దించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. తాను సీమ బిడ్డనని, తనలో ఉన్నది సీమ రక్తమని చంద్రబాబు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు ఎన్నో ఆలోచనలు చేశానని, కానీ, జగన్ ఆ ఆలోచనలకు గండి కొట్టాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on January 27, 2024 6:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

42 minutes ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

2 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

2 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

4 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

4 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

6 hours ago