టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీలేరులో తాజాగా నిర్వహించిన సభలో సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం దగ్గర పడిందని, వైసీపీకి కౌంటర్ మొదలైందని చంద్రబాబు అన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేది గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక భీమిలిలో ఈ రోజు జగన్ మొదలుపెట్టబోతున్న ‘సిద్ధం’ సభపై కూడా చంద్రబాబు స్పందించారు.
ఎన్నికలు వస్తేనే ప్రజల్లోకి జగన్ వస్తారని, సంపూర్ణ మద్య నిషేధంపై మాట తప్పిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు విమర్శించారు. అబద్దాలలో జగన్ పిహెచ్డి చేశారని, పది రూపాయలిచ్చి 100 దోచుకోవడమే జగన్ విధానమని ఎద్దేవా చేశారు. ఇలాంటి జలగ మనకు వద్దని, వై నాట్ పులివెందుల అంటూ జగన్ ను ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు జగన్ కు అభ్యర్థులు దొరకడం లేదని చురకలంటించారు. తమ కసినంత జగన్ పై చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు.
వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి జనాన్ని మోసం చేసిన జగన్ అధికార అహంకారాన్ని దించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. తాను సీమ బిడ్డనని, తనలో ఉన్నది సీమ రక్తమని చంద్రబాబు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు ఎన్నో ఆలోచనలు చేశానని, కానీ, జగన్ ఆ ఆలోచనలకు గండి కొట్టాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on January 27, 2024 6:13 pm
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…