Political News

జగన్..నాది సీమ రక్తం: చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీలేరులో తాజాగా నిర్వహించిన సభలో సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం దగ్గర పడిందని, వైసీపీకి కౌంటర్ మొదలైందని చంద్రబాబు అన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేది గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక భీమిలిలో ఈ రోజు జగన్ మొదలుపెట్టబోతున్న ‘సిద్ధం’ సభపై కూడా చంద్రబాబు స్పందించారు.

ఎన్నికలు వస్తేనే ప్రజల్లోకి జగన్ వస్తారని, సంపూర్ణ మద్య నిషేధంపై మాట తప్పిన జగన్ కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు విమర్శించారు. అబద్దాలలో జగన్ పిహెచ్డి చేశారని, పది రూపాయలిచ్చి 100 దోచుకోవడమే జగన్ విధానమని ఎద్దేవా చేశారు. ఇలాంటి జలగ మనకు వద్దని, వై నాట్ పులివెందుల అంటూ జగన్ ను ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు జగన్ కు అభ్యర్థులు దొరకడం లేదని చురకలంటించారు. తమ కసినంత జగన్ పై చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని జోస్యం చెప్పారు.

వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి జనాన్ని మోసం చేసిన జగన్ అధికార అహంకారాన్ని దించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. తాను సీమ బిడ్డనని, తనలో ఉన్నది సీమ రక్తమని చంద్రబాబు చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు ఎన్నో ఆలోచనలు చేశానని, కానీ, జగన్ ఆ ఆలోచనలకు గండి కొట్టాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

This post was last modified on January 27, 2024 6:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

52 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago