ఏపీ సీఎం జగన్పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. గత రెండు రోజులుగా ఆమె పర్య టనలు చేస్తూ.. వైసీపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ సానుభూతి ఓటు బ్యాంకును కార్నర్ చేసుకుని షర్మిల దూకుడుగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సింపతీ సహా ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అధికార పార్టీ వైసీపీకీ ఆయువుపట్టుగా ఉంది. దీనిపైనే షర్మిల ఇప్పుడు టార్గెట్ చేశారు.
తాజాగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్(అంటే.. రాజశేఖరరెడ్డి) లేరని, కేవలం ఆయన పేరు మాత్రమే ఉందని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్కు కొత్త అర్థం చెప్పారు. వై-అంటే.. వైవీ సుబ్బారెడ్డి, ఎస్-అంటే విజయ సాయిరెడ్డి, ఆర్ – అంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి.. అని వ్యాఖ్యానించారు. వీరే వైసీపీని నడిపిస్తున్నారని అన్నారు. “ఇది.. జగన్ ‘రెడ్డి’ పార్టీ, నియంత పార్టీ, ప్రజలను పట్టించుకోని పార్టీ” అని షర్మిల విమర్శలతో ముంచెత్తారు.
ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టి.. బీజేపీకి బానిసగా వ్యవహరిస్తున్న పార్టీ అంటూ వైసీపీపై షర్మిల విమ ర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క ఆశయాన్నయినా.. వైసీపీ నాయకులు తీర్చారా? అని ప్రశ్నిం చారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన షర్మిల.. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వైసీపీని నిలబెట్టడం కోసం తన రక్తం ధారపోశానని షర్మిల అన్నారు.
గతం మరిచిన వైసీపీ నేతలు ఇప్పుడు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదని తేల్చి చెప్పారు. కాగా, “నేను యుద్ధానికి రెడీ… మీరు రెడీనా..?” అని వైసీపీకి షర్మిల సవాల్ రువ్వారు.
This post was last modified on January 27, 2024 3:58 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…