ఏపీ సీఎం జగన్పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. గత రెండు రోజులుగా ఆమె పర్య టనలు చేస్తూ.. వైసీపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ సానుభూతి ఓటు బ్యాంకును కార్నర్ చేసుకుని షర్మిల దూకుడుగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సింపతీ సహా ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అధికార పార్టీ వైసీపీకీ ఆయువుపట్టుగా ఉంది. దీనిపైనే షర్మిల ఇప్పుడు టార్గెట్ చేశారు.
తాజాగా కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్(అంటే.. రాజశేఖరరెడ్డి) లేరని, కేవలం ఆయన పేరు మాత్రమే ఉందని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్కు కొత్త అర్థం చెప్పారు. వై-అంటే.. వైవీ సుబ్బారెడ్డి, ఎస్-అంటే విజయ సాయిరెడ్డి, ఆర్ – అంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి.. అని వ్యాఖ్యానించారు. వీరే వైసీపీని నడిపిస్తున్నారని అన్నారు. “ఇది.. జగన్ ‘రెడ్డి’ పార్టీ, నియంత పార్టీ, ప్రజలను పట్టించుకోని పార్టీ” అని షర్మిల విమర్శలతో ముంచెత్తారు.
ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టి.. బీజేపీకి బానిసగా వ్యవహరిస్తున్న పార్టీ అంటూ వైసీపీపై షర్మిల విమ ర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క ఆశయాన్నయినా.. వైసీపీ నాయకులు తీర్చారా? అని ప్రశ్నిం చారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన షర్మిల.. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వైసీపీని నిలబెట్టడం కోసం తన రక్తం ధారపోశానని షర్మిల అన్నారు.
గతం మరిచిన వైసీపీ నేతలు ఇప్పుడు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదని తేల్చి చెప్పారు. కాగా, “నేను యుద్ధానికి రెడీ… మీరు రెడీనా..?” అని వైసీపీకి షర్మిల సవాల్ రువ్వారు.
This post was last modified on January 27, 2024 3:58 pm
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…