Political News

ఆ రెండు స్థానాలూ మావే.. : ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి తాము పోటీ చేయ‌నున్న రెండు స్థానాల‌ను ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ-జ‌న‌సేన పొత్తులో బాగంగా రాష్ట్రంలో పోటీ చేస్తామ‌ని మాత్ర‌మే చెప్పుకొచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా.. రెండు కీల‌క నియోజ‌క వ‌ర్గాల పేర్ల‌ను వెల్ల‌డించ‌డం.. జ‌న‌సేన‌లో ఉత్సాహాన్ని నింపింది. వాస్త‌వానికి కొన్ని రోజులుగా జ‌న‌సేన పోటీ చేసే స్థానాల విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌ల ఏకంగా 63 స్థానాలు ఇస్తున్న‌ట్టు టీడీపీ ప్ర‌క‌టించింద‌నే న‌కిలీ ప్ర‌క‌ట‌న ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసింది. దీనిపై విమ‌ర్శ‌లు.. పెద‌వి విరుపులు కూడా వ‌చ్చాయి. మ‌రోవైపు జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కుల్లోనూ ఎన్ని సీట్లు ఎవ‌రికి? అనే చ‌ర్చ సాగింది. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాము ఓ రెండు స్థానాల నుంచి ఖ‌చ్చితంగా పోటీ చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు. రాజోలు(తూర్పు గోదావ‌రి జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాదించింది) సీటును ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

అదేవిధంగా.. రాజాన‌గ‌రం( తూర్పుగోదావ‌రి జిల్లాలోని జ‌న‌ర‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గం) నుంచి తాము పోటీ చేయ‌ను న్న‌ట్టు తెలిపారు. టికెట్ల ఖ‌రారు ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని.. టీడీపీ రెండు స్థానాలు ప్ర‌క‌టించినందున తాను కూడా రెండు స్థానాలు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. ఇక‌, పొత్తులను దెబ్బ‌తీసేలా కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని.. వీటిని జ‌న‌సేన నాయ‌కులు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ప‌వ‌న్ చెప్పారు. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న రిప‌బ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

వ‌చ్చేయండి నేనున్నా..

ఇదిలావుంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ ఆఫ‌ర్ ఇచ్చారు. అది కూడా వైసీపీ నాయ‌కుల‌కు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. “వైసీపీలో ఇబ్బందులు ఉంటే నాద‌గ్గ‌ర‌కు వ‌చ్చేయండి నేను చూసుకుంటా” అని ఆయ‌న పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల మ‌చిలీపట్నం ఎంపీ బాల‌శౌరి త‌న ప‌ద‌వికి, వైసీపీకి రాజీనామా చేసి.. జ‌న‌సేన‌లో చేరిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ఎమ్మెల్సీ వంశీ కృష్ణ కూడా ఇలానే జ‌న‌సేన‌లో చేరారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

This post was last modified on January 26, 2024 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

41 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

3 hours ago