ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ఏటా జాతీయ స్థాయిలో రిలీజ్ చేసే జాబితా కోసం రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం చేయడానికి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు ఎంత సౌకర్యంగా ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఇందులో ర్యాంకులు ఇస్తారు.
వరుసగా రెండో ఏడాది ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. 2018లో నంబర్ వన్గా నిలిచిన ఏపీ.. 2019కి కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు వెల్లడైంది. దీని మీద సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఈ ర్యాంకు తాలూకు క్రెడిట్ కోసం అధికార వైకాపా.. ప్రతిపక్ష తెలుగుదేశం వర్గీయులు తెగ కొట్టేసుకుంటున్నారు. 2019 మే నుంచి జగన్ సర్కారు పరిపాలన నడుస్తోంది కాబట్టి ఈ ర్యాంకు క్రెడిట్ ఆ ప్రభుత్వానిదే అంటున్నారు వైకాపా వర్గీయులు. కానీ తెలుగుదేశం వర్గీయుల వాదన భిన్నంగా ఉంది. 2018-19 వార్షిక సంవత్సరానికి కేటాయించిన ర్యాంకు ఇదని.. కాబట్టి ముందు సంవత్సరం నుంచి లెక్క పెడితే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఈ ర్యాంకు ఘనత బాబుకే దక్కుతుందని అంటున్నారు.
సాంకేతికంగా ఏ కాలానికి ఈ ర్యాంకు ఇచ్చారన్న దానిపై స్పష్టత కొరవడింది. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఐతే వచ్చే ఏడాదికి వచ్చే ర్యాంకు మాత్రం జగన్ సర్కారుకే చెందుతుంది. అప్పుడు వైకాపా ప్రభుత్వ సమర్థత ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది.
This post was last modified on September 6, 2020 1:27 pm
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…