ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ఏటా జాతీయ స్థాయిలో రిలీజ్ చేసే జాబితా కోసం రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటాయి. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారం చేయడానికి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు ఎంత సౌకర్యంగా ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఇందులో ర్యాంకులు ఇస్తారు.
వరుసగా రెండో ఏడాది ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. 2018లో నంబర్ వన్గా నిలిచిన ఏపీ.. 2019కి కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు వెల్లడైంది. దీని మీద సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఈ ర్యాంకు తాలూకు క్రెడిట్ కోసం అధికార వైకాపా.. ప్రతిపక్ష తెలుగుదేశం వర్గీయులు తెగ కొట్టేసుకుంటున్నారు. 2019 మే నుంచి జగన్ సర్కారు పరిపాలన నడుస్తోంది కాబట్టి ఈ ర్యాంకు క్రెడిట్ ఆ ప్రభుత్వానిదే అంటున్నారు వైకాపా వర్గీయులు. కానీ తెలుగుదేశం వర్గీయుల వాదన భిన్నంగా ఉంది. 2018-19 వార్షిక సంవత్సరానికి కేటాయించిన ర్యాంకు ఇదని.. కాబట్టి ముందు సంవత్సరం నుంచి లెక్క పెడితే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే కాబట్టి ఈ ర్యాంకు ఘనత బాబుకే దక్కుతుందని అంటున్నారు.
సాంకేతికంగా ఏ కాలానికి ఈ ర్యాంకు ఇచ్చారన్న దానిపై స్పష్టత కొరవడింది. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఐతే వచ్చే ఏడాదికి వచ్చే ర్యాంకు మాత్రం జగన్ సర్కారుకే చెందుతుంది. అప్పుడు వైకాపా ప్రభుత్వ సమర్థత ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…