Political News

క్రిస్టియ‌న్ సెంట్రిక్ పాలిటిక్స్‌.. ప‌వ‌న్ ఎంట్రీ!

రాష్ట్రంలో గ‌త నాలుగు రోజులుగా క్రిస్టియ‌న్ల కేంద్రంగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలిరోజే.. క్రైస్త‌వుల‌ను కార్న‌ర్ చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ క్రైస్త‌వుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూస్తోంద‌ని.. మ‌ణిపూర్ రాష్ట్రంలో క్రైస్త‌వుల‌పై ద‌మ‌న కాండ జ‌రిగి, హ‌త్య‌లు.. అత్యాచారాలు జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్ క‌నీసం పెద‌వి విప్ప‌లేద‌ని.. ఇదేనా వారిపై ప్రేమ అంటూ ఆమె నిల‌దీశారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి.

ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. క్రైస్త‌వుల‌ను సీఎం జ‌గ‌న్ మోసం చేశార‌ని ఆయ‌న కూడా విమ‌ర్శించారు. రాష్ట్రంలో 97 వేల మంది పాస్ట‌ర్లు ఉన్నార‌ని.. వారంద‌రికీ నెల‌వారీ రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ కేవ‌లం 8500 మందికి మాత్ర‌మే ఇచ్చార‌ని.. అది కూడా ఎంపిక చేసిన వారికి మాత్ర‌మే ఇస్తున్నార‌ని.. ఇది మోసం కాదా? మిగిలిన వారి సంగ‌తేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో టీడీపీ-జ‌నసేన కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే క్రైస్తవులకు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌నసేనాని హామీ ఇచ్చారు. తాజాగా ఆయ‌న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తన స్వార్థం కోసం క్రైస్త‌వుల‌ను వినియోగించుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. తాను క్రిస్టియ‌న్ అని చెప్పుకొనే జ‌గ‌న్‌.. ప్ర‌భువు చెప్పిన ఒక్క సిద్ధాంతాన్ని కూడా అనుస‌రించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రంలో క్రైస్త‌వుల హక్కుల పరిరక్షణకు తాను కొమ్ము కాస్తాన‌న్నారు. పాస్టర్లకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. రాజకీయ నేతలు లౌకిక వాదాన్ని కూడా రాజ‌కీయంగా మార్చార‌ని, ఓటు బ్యాంకుగానే చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. జగన్ హయాంలో 517 హిందూ దేవాలయాలపై దాడులు జ‌రిగాయ‌ని.. వీటిని క్రైస్తవులే చేయించార‌న్న అభిప్రాయం ఉంద‌ని.. అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌లేద‌ని.. మ‌రి క్రైస్త‌వులు ఆయ‌న‌ను ఎందుకు విశ్వ‌సించాల‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు కూడా క్రిస్టియానిటీ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని పేర్కొన్నారు. బైబిల్ చ‌దివాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

This post was last modified on January 25, 2024 11:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

2 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

3 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

4 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

4 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

5 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

5 hours ago