Political News

క్రిస్టియ‌న్ సెంట్రిక్ పాలిటిక్స్‌.. ప‌వ‌న్ ఎంట్రీ!

రాష్ట్రంలో గ‌త నాలుగు రోజులుగా క్రిస్టియ‌న్ల కేంద్రంగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలిరోజే.. క్రైస్త‌వుల‌ను కార్న‌ర్ చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ క్రైస్త‌వుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూస్తోంద‌ని.. మ‌ణిపూర్ రాష్ట్రంలో క్రైస్త‌వుల‌పై ద‌మ‌న కాండ జ‌రిగి, హ‌త్య‌లు.. అత్యాచారాలు జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్ క‌నీసం పెద‌వి విప్ప‌లేద‌ని.. ఇదేనా వారిపై ప్రేమ అంటూ ఆమె నిల‌దీశారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి.

ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. క్రైస్త‌వుల‌ను సీఎం జ‌గ‌న్ మోసం చేశార‌ని ఆయ‌న కూడా విమ‌ర్శించారు. రాష్ట్రంలో 97 వేల మంది పాస్ట‌ర్లు ఉన్నార‌ని.. వారంద‌రికీ నెల‌వారీ రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ కేవ‌లం 8500 మందికి మాత్ర‌మే ఇచ్చార‌ని.. అది కూడా ఎంపిక చేసిన వారికి మాత్ర‌మే ఇస్తున్నార‌ని.. ఇది మోసం కాదా? మిగిలిన వారి సంగ‌తేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో టీడీపీ-జ‌నసేన కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే క్రైస్తవులకు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌నసేనాని హామీ ఇచ్చారు. తాజాగా ఆయ‌న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తన స్వార్థం కోసం క్రైస్త‌వుల‌ను వినియోగించుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. తాను క్రిస్టియ‌న్ అని చెప్పుకొనే జ‌గ‌న్‌.. ప్ర‌భువు చెప్పిన ఒక్క సిద్ధాంతాన్ని కూడా అనుస‌రించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రంలో క్రైస్త‌వుల హక్కుల పరిరక్షణకు తాను కొమ్ము కాస్తాన‌న్నారు. పాస్టర్లకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. రాజకీయ నేతలు లౌకిక వాదాన్ని కూడా రాజ‌కీయంగా మార్చార‌ని, ఓటు బ్యాంకుగానే చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. జగన్ హయాంలో 517 హిందూ దేవాలయాలపై దాడులు జ‌రిగాయ‌ని.. వీటిని క్రైస్తవులే చేయించార‌న్న అభిప్రాయం ఉంద‌ని.. అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌లేద‌ని.. మ‌రి క్రైస్త‌వులు ఆయ‌న‌ను ఎందుకు విశ్వ‌సించాల‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు కూడా క్రిస్టియానిటీ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని పేర్కొన్నారు. బైబిల్ చ‌దివాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

Satya

Recent Posts

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో…

11 minutes ago

రణబాలికి సర్దార్ టెన్షన్ ఉంటుందా

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…

34 minutes ago

మోదీకి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు

రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…

53 minutes ago

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…

1 hour ago

గ్రీన్ కార్డు గొప్ప‌లు వ‌ద్దు: సుప్రీంకోర్టు కొర‌డా ఇదిగో!

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం గ్రీన్ కార్డ్‌.. అత్యంత కీల‌కం. దీనిని సాధించ‌డ‌మే మ‌హా య‌జ్ఞం చేసినంత ప‌నిగా…

2 hours ago

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

3 hours ago