Political News

క్రిస్టియ‌న్ సెంట్రిక్ పాలిటిక్స్‌.. ప‌వ‌న్ ఎంట్రీ!

రాష్ట్రంలో గ‌త నాలుగు రోజులుగా క్రిస్టియ‌న్ల కేంద్రంగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలిరోజే.. క్రైస్త‌వుల‌ను కార్న‌ర్ చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ క్రైస్త‌వుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూస్తోంద‌ని.. మ‌ణిపూర్ రాష్ట్రంలో క్రైస్త‌వుల‌పై ద‌మ‌న కాండ జ‌రిగి, హ‌త్య‌లు.. అత్యాచారాలు జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్ క‌నీసం పెద‌వి విప్ప‌లేద‌ని.. ఇదేనా వారిపై ప్రేమ అంటూ ఆమె నిల‌దీశారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి.

ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. క్రైస్త‌వుల‌ను సీఎం జ‌గ‌న్ మోసం చేశార‌ని ఆయ‌న కూడా విమ‌ర్శించారు. రాష్ట్రంలో 97 వేల మంది పాస్ట‌ర్లు ఉన్నార‌ని.. వారంద‌రికీ నెల‌వారీ రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ కేవ‌లం 8500 మందికి మాత్ర‌మే ఇచ్చార‌ని.. అది కూడా ఎంపిక చేసిన వారికి మాత్ర‌మే ఇస్తున్నార‌ని.. ఇది మోసం కాదా? మిగిలిన వారి సంగ‌తేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో టీడీపీ-జ‌నసేన కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే క్రైస్తవులకు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌నసేనాని హామీ ఇచ్చారు. తాజాగా ఆయ‌న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తన స్వార్థం కోసం క్రైస్త‌వుల‌ను వినియోగించుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. తాను క్రిస్టియ‌న్ అని చెప్పుకొనే జ‌గ‌న్‌.. ప్ర‌భువు చెప్పిన ఒక్క సిద్ధాంతాన్ని కూడా అనుస‌రించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రంలో క్రైస్త‌వుల హక్కుల పరిరక్షణకు తాను కొమ్ము కాస్తాన‌న్నారు. పాస్టర్లకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. రాజకీయ నేతలు లౌకిక వాదాన్ని కూడా రాజ‌కీయంగా మార్చార‌ని, ఓటు బ్యాంకుగానే చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. జగన్ హయాంలో 517 హిందూ దేవాలయాలపై దాడులు జ‌రిగాయ‌ని.. వీటిని క్రైస్తవులే చేయించార‌న్న అభిప్రాయం ఉంద‌ని.. అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌లేద‌ని.. మ‌రి క్రైస్త‌వులు ఆయ‌న‌ను ఎందుకు విశ్వ‌సించాల‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు కూడా క్రిస్టియానిటీ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని పేర్కొన్నారు. బైబిల్ చ‌దివాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

This post was last modified on January 25, 2024 11:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago