వైసీపీలో కొందరు నాయకుల పరిస్థితి భిన్నంగా ఉంది. టికెట్ దక్కలేదని.. చాలా మంది నాయకులు వగరుస్తుండగా.. టికెట్ దక్కించుకున్న నాయకుల పరిస్తితి మరోలా ఉంది. తమకు ఈ సీటు వద్దు.. వేరే సీటు కావాలని నాయకులు మంకు పట్టుపడుతున్నారు. అయితే.. వైసీపీ అధిష్టానం మాత్రం.. అన్నీ ఆలోచించే నీకు సీటు ఎలాట్ చేశామని, దీనిలో ఎలాంటి మార్పూ లేదని తేల్చేస్తోంది. దీంతో ఇప్పటికే ఇంచార్జు లుగా నియమితులైనప్పటికీ.. అసంతృప్తితో ఉన్నవారు పక్క చూపులు చూస్తున్నారు.
ఇలాంటివారిలో వైసీపీ కీలక నేత, బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం ఒకరు. ఈయన ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ పరిస్థితి బాగోలేదని చెబుతూ.. ఆయనను కర్నూలు పార్లమెంటు స్థానానికి వైసీపీ పంపించింది. ఇదే.. ఇప్పుడు గుమ్మనూరుకు గుబులు రేపుతోంది. ఎమ్మెల్యేగా పనికిరానని తేల్చేసిన వైసీపీ ఎంపీ సీటులో ఇంచార్జ్గా నియమించడం ఏంటని ఆయన చింతిస్తున్నారు.
ఈ క్రమంలో తనను కాదని వేరే వారికి సీటు ఇచ్చేందుకు.. వైసీపీ వ్యూహాత్మకంగా తనను కర్నూలుకు పంపించిందని గుమ్మనూరు అనుమానిస్తున్నారు. దీంతో ఆయన తెరచాటున తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలతో భేటీ అయిన ఆయన.. ఎంపీ టికెట్ జేబులోనే ఉందని.. మీ నిర్ణయం ఏంటోచెబితే దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు అంతేకాదు.. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని కూడా చెప్పారు.
ఇప్పుడు వారం రోజులకు పైగానే గుమ్మనూరు హైదరాబాద్లో తిష్ఠ వేశారు. ఆయన చూపు ప్రధానంగా టీడీపీపైనే ఉందని తెలుస్తోంది. మరోసారి ఆలూరు నుంచి విజయం దక్కించుకోవాలని భావిస్తున్న గుమ్మనూరు.. టీడీపీ నుంచిఈ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ టికెట్ కుదరకపోతే.. వేరేదైనా ఇవ్వాలని అంటున్నారు. కానీ, గతంలో మాజీ మంత్రి అయ్యన్నతో ఉన్న వివాదం నేపథ్యంలో టీడీపీ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన గుమ్మనూరు. అయితే.. టీడీపీ లేకుంటే కాంగ్రెస్ అన్నట్టుగా మరోవైపు హస్తం నేతలతోనూ టచ్లోకి వచ్చారని నియోజకవర్గం టాక్. మరి చివరకు ఎటు వెళ్తారో చూడాలి.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…