వైసీపీలో కొందరు నాయకుల పరిస్థితి భిన్నంగా ఉంది. టికెట్ దక్కలేదని.. చాలా మంది నాయకులు వగరుస్తుండగా.. టికెట్ దక్కించుకున్న నాయకుల పరిస్తితి మరోలా ఉంది. తమకు ఈ సీటు వద్దు.. వేరే సీటు కావాలని నాయకులు మంకు పట్టుపడుతున్నారు. అయితే.. వైసీపీ అధిష్టానం మాత్రం.. అన్నీ ఆలోచించే నీకు సీటు ఎలాట్ చేశామని, దీనిలో ఎలాంటి మార్పూ లేదని తేల్చేస్తోంది. దీంతో ఇప్పటికే ఇంచార్జు లుగా నియమితులైనప్పటికీ.. అసంతృప్తితో ఉన్నవారు పక్క చూపులు చూస్తున్నారు.
ఇలాంటివారిలో వైసీపీ కీలక నేత, బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం ఒకరు. ఈయన ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ పరిస్థితి బాగోలేదని చెబుతూ.. ఆయనను కర్నూలు పార్లమెంటు స్థానానికి వైసీపీ పంపించింది. ఇదే.. ఇప్పుడు గుమ్మనూరుకు గుబులు రేపుతోంది. ఎమ్మెల్యేగా పనికిరానని తేల్చేసిన వైసీపీ ఎంపీ సీటులో ఇంచార్జ్గా నియమించడం ఏంటని ఆయన చింతిస్తున్నారు.
ఈ క్రమంలో తనను కాదని వేరే వారికి సీటు ఇచ్చేందుకు.. వైసీపీ వ్యూహాత్మకంగా తనను కర్నూలుకు పంపించిందని గుమ్మనూరు అనుమానిస్తున్నారు. దీంతో ఆయన తెరచాటున తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తలతో భేటీ అయిన ఆయన.. ఎంపీ టికెట్ జేబులోనే ఉందని.. మీ నిర్ణయం ఏంటోచెబితే దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు అంతేకాదు.. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని కూడా చెప్పారు.
ఇప్పుడు వారం రోజులకు పైగానే గుమ్మనూరు హైదరాబాద్లో తిష్ఠ వేశారు. ఆయన చూపు ప్రధానంగా టీడీపీపైనే ఉందని తెలుస్తోంది. మరోసారి ఆలూరు నుంచి విజయం దక్కించుకోవాలని భావిస్తున్న గుమ్మనూరు.. టీడీపీ నుంచిఈ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ టికెట్ కుదరకపోతే.. వేరేదైనా ఇవ్వాలని అంటున్నారు. కానీ, గతంలో మాజీ మంత్రి అయ్యన్నతో ఉన్న వివాదం నేపథ్యంలో టీడీపీ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గ్రహించిన గుమ్మనూరు. అయితే.. టీడీపీ లేకుంటే కాంగ్రెస్ అన్నట్టుగా మరోవైపు హస్తం నేతలతోనూ టచ్లోకి వచ్చారని నియోజకవర్గం టాక్. మరి చివరకు ఎటు వెళ్తారో చూడాలి.
This post was last modified on January 24, 2024 10:49 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…