వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒకవైపు అదికార పార్టీ వైసీపీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అభ్యర్థులను ప్రజల నాడికి.. సర్వేల సమాచారానికి అనుకూలంగా మారుస్తోంది. ఈ క్రమంలో చిన్నపాటి వ్యతిరేకతలు వచ్చినా.. పార్టీ ప్రజల ననాడికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోంది. ఎక్కడా ఎవరి డిమాండ్లకు తలవంచే పరిస్థితి లేకుండా ముందుకు సాగుతోంది. మరి ఇదే పరిస్థితి టీడీపీలో లేదు. ఎటు చూసుకున్నా అందరూ సీనియర్లే. పైగా.. నియోజకవర్గాల్లో తిష్టవేశారు కూడా.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. అభ్యర్థుల జాబితాలు ప్రకటించే విషయంలో ఇలాంటి సమస్యలే టీడీపీకి ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఒక నియోజకవర్గంలో పొరుగు పార్టీ నేతను చేర్చుకుని, టికెట్ ఇచ్చే విషయం రాజకీయంగా దుమారం రేపేందుకు రెడీగా ఉంది. మరోవైపు జనసేన మిత్రపక్షంగా ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలను ప్రకటించడం.. రాజకీయ కాకకు సిద్ధంగా ఉంది. వెరసి ఇలా టీడీపీకి ముందు-వెనుక కూడా ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ఇంకో వైపు.. ఒక కుటుంబానికి ఒక టికెట్ అని ప్రకటించిన చంద్రబాబు కొన్ని కుటుంబాలకు మినహాయింపు ఇచ్చి.. మరికొన్ని కుటుంబాలకు మాత్రం రెండేసి మూడేసి టికెట్లు ఇచ్చేందుకు సిద్ధం కావడం కూడా రాజకీయ దుమారానికి దారి తీసే పరిస్థితి ఏర్పడింది. గతంలో 2022 మహానాడు నాడు.. 33 శాతం సీట్లను యువతకు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని ఆయన మరిచిపోయినా.. పార్టీలో సేవ చేస్తున్నవారు మాత్రం గుర్తు పెట్టుకున్నారు. దీంతో వారి పరిస్థితి ఏంటనేది కూడా ఆసక్తిగా మారింది.
ఎలా చూసుకున్నా.. మరో వారమో లేదా రెండు వారాల్లోనో.. టీడీపీ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే.. ఇది వివాదం కాకుండా ఉండాలంటే.. ముందుగానే నాయకులను బుజ్జగించడం.. వారి పరిస్తితిని వివరించడం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొంత వరకు మేలు జరుగుతుందనే వాదన ఉంది. పైగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు గతంలోనే ఇంచార్జ్లుగా కొందరిని నియమించారు. మరివారి పరిస్థితి ఏంటనేది కూడా చర్చగా మారింది. ఎలా చూసుకున్నా.. బాబు ముందుగానే ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తే.. తలనొప్పు తగ్గుతాయని అంటున్నారు పరిశీలకులు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…