వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒకవైపు అదికార పార్టీ వైసీపీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అభ్యర్థులను ప్రజల నాడికి.. సర్వేల సమాచారానికి అనుకూలంగా మారుస్తోంది. ఈ క్రమంలో చిన్నపాటి వ్యతిరేకతలు వచ్చినా.. పార్టీ ప్రజల ననాడికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటోంది. ఎక్కడా ఎవరి డిమాండ్లకు తలవంచే పరిస్థితి లేకుండా ముందుకు సాగుతోంది. మరి ఇదే పరిస్థితి టీడీపీలో లేదు. ఎటు చూసుకున్నా అందరూ సీనియర్లే. పైగా.. నియోజకవర్గాల్లో తిష్టవేశారు కూడా.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. అభ్యర్థుల జాబితాలు ప్రకటించే విషయంలో ఇలాంటి సమస్యలే టీడీపీకి ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఒక నియోజకవర్గంలో పొరుగు పార్టీ నేతను చేర్చుకుని, టికెట్ ఇచ్చే విషయం రాజకీయంగా దుమారం రేపేందుకు రెడీగా ఉంది. మరోవైపు జనసేన మిత్రపక్షంగా ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలను ప్రకటించడం.. రాజకీయ కాకకు సిద్ధంగా ఉంది. వెరసి ఇలా టీడీపీకి ముందు-వెనుక కూడా ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ఇంకో వైపు.. ఒక కుటుంబానికి ఒక టికెట్ అని ప్రకటించిన చంద్రబాబు కొన్ని కుటుంబాలకు మినహాయింపు ఇచ్చి.. మరికొన్ని కుటుంబాలకు మాత్రం రెండేసి మూడేసి టికెట్లు ఇచ్చేందుకు సిద్ధం కావడం కూడా రాజకీయ దుమారానికి దారి తీసే పరిస్థితి ఏర్పడింది. గతంలో 2022 మహానాడు నాడు.. 33 శాతం సీట్లను యువతకు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని ఆయన మరిచిపోయినా.. పార్టీలో సేవ చేస్తున్నవారు మాత్రం గుర్తు పెట్టుకున్నారు. దీంతో వారి పరిస్థితి ఏంటనేది కూడా ఆసక్తిగా మారింది.
ఎలా చూసుకున్నా.. మరో వారమో లేదా రెండు వారాల్లోనో.. టీడీపీ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే.. ఇది వివాదం కాకుండా ఉండాలంటే.. ముందుగానే నాయకులను బుజ్జగించడం.. వారి పరిస్తితిని వివరించడం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కొంత వరకు మేలు జరుగుతుందనే వాదన ఉంది. పైగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు గతంలోనే ఇంచార్జ్లుగా కొందరిని నియమించారు. మరివారి పరిస్థితి ఏంటనేది కూడా చర్చగా మారింది. ఎలా చూసుకున్నా.. బాబు ముందుగానే ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తే.. తలనొప్పు తగ్గుతాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 22, 2024 10:22 am
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…