తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని పలువురు రాజకీయ ప్రముఖులకు వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న సంగతి తె లిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కొద్ది రోజుల క్రితం కలిసి ఆహ్వాన పత్రికను షర్మిల స్వయంగా అందజేశారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను షర్మిల కలిసి ఆహ్వాన పత్రికను ఇచ్చారు.
తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని పవన్ ను షర్మిల కోరారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లిన షర్మిల పవన్ తో కాసేపు మాట్లాడారు. నూతన వధూవరుల గురించి షర్మిలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమితులైన సందర్భంగా షర్మిలకు పుష్ప గుచ్ఛం ఇచ్చి పవన్ అభినందించారు. మరోవైపు, రాజారెడ్డి, ప్రియ అట్లూరిల నిశ్చితార్ధం ఈ నెల 18వ తేదీన జరగనుంది. జగన్తో చాలాకాలంగా దూరంగా ఉన్న షర్మిల తన కుమారుడి నిశ్చితార్ధం, పెళ్లికి హాజరు కావాలని స్వయంగా తాడేపల్లిలో జగన్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.
హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్లో జరగనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ లను కూడా షర్మిల ఆహ్వానించడం, షర్మిలతో చాలా రోజులుగా గ్యాప్ ఉన్న నేపథ్యంలో మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజారెడ్డి, ప్రియల వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరగనుంది. నిశ్చితార్ధ ఆహ్వానాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 17, 2024 11:28 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…