మాకు ప్రచారం కాదు.. ఫలితం కావాలి. మీకు ఫలితంతో పనిలేదు.. ప్రచారం కావాలి- తాజాగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఉద్దేశించి అధికార పార్టీ వైసీపీ చేసిన వ్యాఖ్యలు. దీనికి ప్రతిగా.. టీడీపీ నాయకులు కూడా అదే రేంజ్లో విమర్శలు చేశారు. మేం ప్రచారం-ఫలితం రెండు దక్కించుకున్నాం.. అని ఎదురు దాడికి దిగారు. గత 24 గంటలుగా ఇరు పార్టీల సోషల్ మీడియాలోనూ ఇదే వార్ జరుగుతోంది. దీంతో ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పొలిటికల్ సెగ మరింత పెరిగినట్టయింది.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం దావోస్లో అంతర్జాతీయ వాణిజ్యసదస్సు జరుగుతోంది. ఇది ప్రతి ఏటా జనవరిలో జరిగే కార్యక్రమమే. అయితే.. ఈ సదస్సుకు పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా అదానీ సహా పలు కంపెనీలతో ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. ఇవి ప్రముఖంగా వెలుగు చూశాయి. దీంతో ఏపీలో ఏం జరుగుతోందనే విషయం కూడా ఆరా వచ్చింది. ఏపీ సీఎం జగన్ కానీ, ఆయన మంత్రులు కానీ, దావోస్వైపు చూడలేదు.
ఎన్నికలకు ముందు ఎందుకులే అనుకున్నారో.. లేక అధికారులను ఎవరినైనా పంపించారో తెలియదు కానీ.. దావోస్లో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య సదస్సును లైట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ.. టీడీపీ నిప్పులు చెరిగింది. ఏపీ సీఎం జగన్కు రాష్ట్ర అభివృద్ది అంటే.. పట్టడం లేదని.. ఆయనకు దావోస్ గురించి.. అభివృద్ధి గురించి తెలియదని విమర్శలు గుప్పించింది. దీనికి ప్రతిగా.. వైసీపీ నుంచి ఎదురుదాడి ఎదురైంది.
గత ఏడాది జరిగిన దావోస్ సదస్సుకు సీఎం జగన్ హాజరైన దృశ్యాలు, వీడియోలను షేర్ చేస్తూ.. టీడీపీ పై విమర్శలు గుప్పించింది. విశాఖలో నిర్వహించిన సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని.. తమకు ప్రచారంతో పనిలేదని.. ఫలితాలు మాత్రమే కావాలని సటైర్లు వేసింది. కానీ, టీడీపీ నేతలు మాత్రం దావోస్కు వెళ్లి.. ఏం తెచ్చారో చెప్పుకోలేక.. అప్పటి ఫొటోలు వీడియోలు చూపిస్తూ.. ప్రచారం చేస్తున్నారని.. ఎద్దేవా చేసింది. దీనిపై టీడీపీ కూడా అదే రేంజ్లో విమర్శలు గుప్పించింది. మొత్తంగా ఎన్నికలకు ముందు దావోస్. . వ్యవహారం ఇరు పార్టీల మధ్య రాజకీయ చర్చకు వివాదానికి దారి తీయడం గమనార్హం.
This post was last modified on January 17, 2024 11:11 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…