Political News

వైసీపీపై షర్మిల ఎఫెక్ట్ ఎంతో చెప్పిన రఘురామ

దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంక్రాంతి వేడుకలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామను పలువురు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారితో రఘురామ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వర్తమాన రాజకీయాలపై, ఏపీలోని రాజకీయ పరిస్థితులపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందని రఘురామ అన్నారు.

పార్లమెంటు సమావేశాల తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక, వైసీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎఫెక్ట్ ఉంటుందని రఘురామ అన్నారు. వైసీపీ ఓట్లలో 5-7 శాతం కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు కేసులో కీలకంగా మారిన సెక్షన్ 17 17 ఏ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాక్షి పత్రికలో వక్రీకరికరించారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనే దీనిపై విచారణ జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 135 నుంచి 150 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వైసీపీని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలలోను వైసీపీపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని చెప్పారు. కాగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఏపీ పోలీసులు రక్షణ కల్పించడంతో ఆయన తన సొంత ఊరు భీమవరంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

This post was last modified on January 17, 2024 8:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శాశ్వత్ సచ్ దేవ్… మనకు సూటవుతాడా

దురంధర్ ది రివెంజ్ విడుదలయ్యాక ఈ సినిమాలోని పాటలు చాలా వైరల్ అవుతున్నాయి. మొదటి భాగంలోనూ ఛార్ట్ బస్టర్స్ ఉన్నప్పటికీ…

17 minutes ago

ఐశ్వర్య… వెంకీ త‌ర్వాత నాగార్జున‌తో?

త‌న వందో సినిమాను చ‌డీ చ‌ప్పుడు లేకుండా మొద‌లుపెట్టి.. చ‌క‌చ‌కా పూర్తి చేసేస్తున్నాడు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున‌.…

46 minutes ago

ఒత్తిడి బరువులో ‘పెద్ది’ వాయిదాలు

ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ పెద్ది ఏప్రిల్ 30 రావడం లేదనే వార్త సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఖచ్చితంగా రిలీజ్…

1 hour ago

‘కేసీఆర్‌, హ‌రీష్‌రావును జైల్లో పెట్టాక మాట్లాడండి’

కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతి, దీనికి సంబంధించి నియ‌మించిన పీసీ ఘోష్ నివేదిక అంశాల‌పై తెలంగాణ అసెంబ్లీలో నిన్న స్వ‌ల్పకాలిక చ‌ర్చ…

2 hours ago

యువతిని ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టాడు.. తల ఎక్కడ?

విశాఖపట్నం గాజువాక పరిధిలోని ఎల్‌వీ నగర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. నేవీ ఉద్యోగి రవీంద్ర తనకు పరిచయమైన మౌనిక (29)ను…

4 hours ago

అబ్బవరం లెవెల్ మారుతోంది

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగు పెట్టి.. హీరోగా ఒక స్థాయి అందుకోవడం తేలికైన విషయం కాదు. చాలా…

7 hours ago