Political News

వైసీపీపై షర్మిల ఎఫెక్ట్ ఎంతో చెప్పిన రఘురామ

దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంక్రాంతి వేడుకలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామను పలువురు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారితో రఘురామ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వర్తమాన రాజకీయాలపై, ఏపీలోని రాజకీయ పరిస్థితులపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందని రఘురామ అన్నారు.

పార్లమెంటు సమావేశాల తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక, వైసీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎఫెక్ట్ ఉంటుందని రఘురామ అన్నారు. వైసీపీ ఓట్లలో 5-7 శాతం కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు కేసులో కీలకంగా మారిన సెక్షన్ 17 17 ఏ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాక్షి పత్రికలో వక్రీకరికరించారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనే దీనిపై విచారణ జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 135 నుంచి 150 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వైసీపీని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలలోను వైసీపీపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని చెప్పారు. కాగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఏపీ పోలీసులు రక్షణ కల్పించడంతో ఆయన తన సొంత ఊరు భీమవరంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

This post was last modified on January 17, 2024 8:31 pm

Share

Recent Posts

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

17 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

43 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

1 hour ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

1 hour ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

5 hours ago