Political News

వైసీపీపై షర్మిల ఎఫెక్ట్ ఎంతో చెప్పిన రఘురామ

దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంక్రాంతి వేడుకలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామను పలువురు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారితో రఘురామ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వర్తమాన రాజకీయాలపై, ఏపీలోని రాజకీయ పరిస్థితులపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందని రఘురామ అన్నారు.

పార్లమెంటు సమావేశాల తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక, వైసీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎఫెక్ట్ ఉంటుందని రఘురామ అన్నారు. వైసీపీ ఓట్లలో 5-7 శాతం కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు కేసులో కీలకంగా మారిన సెక్షన్ 17 17 ఏ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాక్షి పత్రికలో వక్రీకరికరించారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనే దీనిపై విచారణ జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 135 నుంచి 150 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వైసీపీని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలలోను వైసీపీపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని చెప్పారు. కాగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఏపీ పోలీసులు రక్షణ కల్పించడంతో ఆయన తన సొంత ఊరు భీమవరంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Satya

Recent Posts

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

5 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

57 minutes ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

1 hour ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

1 hour ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

2 hours ago