Political News

వైసీపీపై షర్మిల ఎఫెక్ట్ ఎంతో చెప్పిన రఘురామ

దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంక్రాంతి వేడుకలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామను పలువురు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారితో రఘురామ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వర్తమాన రాజకీయాలపై, ఏపీలోని రాజకీయ పరిస్థితులపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందని రఘురామ అన్నారు.

పార్లమెంటు సమావేశాల తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇక, వైసీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎఫెక్ట్ ఉంటుందని రఘురామ అన్నారు. వైసీపీ ఓట్లలో 5-7 శాతం కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు కేసులో కీలకంగా మారిన సెక్షన్ 17 17 ఏ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాక్షి పత్రికలో వక్రీకరికరించారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలోనే దీనిపై విచారణ జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 135 నుంచి 150 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వైసీపీని ఇంటికి సాగనంపేందుకు రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలలోను వైసీపీపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని చెప్పారు. కాగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు ఏపీ పోలీసులు రక్షణ కల్పించడంతో ఆయన తన సొంత ఊరు భీమవరంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

This post was last modified on January 17, 2024 8:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

37 minutes ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

58 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

1 hour ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

1 hour ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

2 hours ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

4 hours ago