టీడీపీలో ఒకటి కాదు.. రెండు టికెట్లు కోరుకునేవారు పెరుగుతున్నారు. వీరిలో ఒకే కుటుంబం నుంచి తల్లీ కుమారులు, తండ్రీ కూతుళ్లు, అన్నదమ్ములు కూడా ఉండడం గమనార్హం. చివరకు ఇది చంద్రబాబుకు మొహమాటాల చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం సహా.. ధర్మవరం నియోజకవర్గాన్ని పరిటాల కుటుంబం ఆశిస్తోంది. పరిటాల రవి వారసుడిగా 2019 ఎన్నికల సమయంలో తెరమీదికి వచ్చిన.. శ్రీరామ్.. మరోసారి తన అదృష్టం పరిశీలించుకునేందుకు రెడీ అయ్యారు.
ఇక, పరిటాల రవి సతీమణి.. సునీత కూడా ఈ దఫా పోటీకి సై అంటున్నారు. అంతేకాదు.. ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వాలని ఆమె టీడీపీ అధినేత చంద్రబాబుకు రిక్వెస్టు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తానే తప్పుకొంటానని.. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని ఆమె అభ్యర్థిస్తున్నారు. ఇక, రవి వరసుడిగా ఉన్న శ్రీరాం.. ఈ దఫా గెలిచి తీరుతానని.. కాబట్టి.. ఈసారి మిస్ కాకుండా తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నా రు. రాప్తాడును తన మాతృమూర్తి సునీతకు కేటాయించాలని.. ధర్మవరం టికెట్ను తనకు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.
ఇదే విషయాన్ని సునీత కూడా చంద్రబాబుకు చెబుతున్నారు. మొత్తానికి పరిటాల కుటుంబం చంద్రబా బును తీవ్రస్థాయిలో మొహమాట పెట్టేస్తోందని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే పరిటాల కుటుంబంపై అధ్యయనం చేయించిన చంద్రబాబు.. ఒక్కసీటుకే పరిమితం కావాలని.. గత ఆరు మాసాల ముందుగానే చెప్పారు. రాప్తాడు లేదా.. ధర్మవరం ఏదో ఒకటి ఎంచుకుని అక్కడ నుంచే పోటీ చేయాలని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, తల్లికుమారుడు మాత్రం రెండు కోసం పట్టుబడుతున్నారు.
ఇదిలావుంటే.. శ్రీరాం.. ఈ విషయంలో పట్టు విడిచిపెట్టే పరిస్థితిలో కనిపించడం లేదు. ధర్మవరంలో సభలు పెడుతున్నారు. టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరదాపురం సూరి (గోనుగుం డ్ల సూర్యనారాయణ)కు సవాళ్లు సైతం రువ్వుతున్నారు. నియోజకవర్గంలోకి ఎలా అడుగు పెడతారని.. టీడీపీ టికెట్ ఎలా ఆశిస్తారని.. ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక, రాప్తాడులో పరిటాల సునీత పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు. దీంతో ఈ ఇద్దరి విషయం రెండు నియోజకవర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. దీనిపై చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.
This post was last modified on January 16, 2024 10:44 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…