Political News

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌.. చంద్ర‌బాబుకు మొహ‌మాటాల‌ వెల్లువ‌!

టీడీపీలో ఒక‌టి కాదు.. రెండు టికెట్‌లు కోరుకునేవారు పెరుగుతున్నారు. వీరిలో ఒకే కుటుంబం నుంచి త‌ల్లీ కుమారులు, తండ్రీ కూతుళ్లు, అన్న‌ద‌మ్ములు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. చివ‌ర‌కు ఇది చంద్ర‌బాబుకు మొహ‌మాటాల చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం స‌హా.. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌రిటాల కుటుంబం ఆశిస్తోంది. ప‌రిటాల ర‌వి వార‌సుడిగా 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో తెర‌మీదికి వ‌చ్చిన‌.. శ్రీరామ్‌.. మ‌రోసారి త‌న అదృష్టం ప‌రిశీలించుకునేందుకు రెడీ అయ్యారు.

ఇక‌, ప‌రిటాల ర‌వి స‌తీమ‌ణి.. సునీత కూడా ఈ ద‌ఫా పోటీకి సై అంటున్నారు. అంతేకాదు.. ఈ ఒక్క‌సారికి ఛాన్స్ ఇవ్వాల‌ని ఆమె టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రిక్వెస్టు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తానే త‌ప్పుకొంటాన‌ని.. ఈ ఒక్క‌సారికి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆమె అభ్య‌ర్థిస్తున్నారు. ఇక‌, ర‌వి వ‌ర‌సుడిగా ఉన్న శ్రీరాం.. ఈ ద‌ఫా గెలిచి తీరుతాన‌ని.. కాబ‌ట్టి.. ఈసారి మిస్ కాకుండా త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నా రు. రాప్తాడును త‌న మాతృమూర్తి సునీత‌కు కేటాయించాల‌ని.. ధ‌ర్మ‌వ‌రం టికెట్‌ను త‌న‌కు ఇవ్వాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు.

ఇదే విష‌యాన్ని సునీత కూడా చంద్ర‌బాబుకు చెబుతున్నారు. మొత్తానికి ప‌రిటాల కుటుంబం చంద్ర‌బా బును తీవ్ర‌స్థాయిలో మొహ‌మాట పెట్టేస్తోంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే ప‌రిటాల కుటుంబంపై అధ్య‌య‌నం చేయించిన చంద్ర‌బాబు.. ఒక్క‌సీటుకే ప‌రిమితం కావాల‌ని.. గత ఆరు మాసాల ముందుగానే చెప్పారు. రాప్తాడు లేదా.. ధ‌ర్మ‌వ‌రం ఏదో ఒక‌టి ఎంచుకుని అక్క‌డ నుంచే పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. కానీ, త‌ల్లికుమారుడు మాత్రం రెండు కోసం ప‌ట్టుబడుతున్నారు.

ఇదిలావుంటే.. శ్రీరాం.. ఈ విష‌యంలో ప‌ట్టు విడిచిపెట్టే ప‌రిస్థితిలో క‌నిపించ‌డం లేదు. ధ‌ర్మ‌వ‌రంలో స‌భ‌లు పెడుతున్నారు. టీడీపీ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న వ‌ర‌దాపురం సూరి (గోనుగుం డ్ల సూర్య‌నారాయ‌ణ‌)కు స‌వాళ్లు సైతం రువ్వుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎలా అడుగు పెడ‌తార‌ని.. టీడీపీ టికెట్ ఎలా ఆశిస్తార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, రాప్తాడులో ప‌రిటాల సునీత పాద‌యాత్ర చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని కోరుతున్నారు. దీంతో ఈ ఇద్ద‌రి విష‌యం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్థానిక నాయ‌కులు కోరుతున్నారు.

This post was last modified on January 16, 2024 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘సిందూర్’లో ఏం జరిగిందంటే..?

జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…

16 minutes ago

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ‘సిందూర్’ మద్దతు

ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…

37 minutes ago

‘ఆపరేషన్ సిందూర్’.. ఈ పేరే ఎందుకు పెట్టారంటే?

భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…

1 hour ago

వీరమల్లుకున్న ఇరకాటం అదొక్కటే

షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…

2 hours ago

జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా దొర‌కలేదు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రికి తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…

3 hours ago

పాక్ పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…

4 hours ago