వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, జాతీయ స్థాయిలో ఏఐసీసీ సభ్యురారిగా ఏదో ఒక హోదాలో ఆమెను నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాను అధిష్టానం అప్పగించిన బాధ్యతను అండమాన్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది.
తన పదవికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తాజాగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన పంపించారు. మణిపూర్ లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఏపీలో బలోపేతం చేసేందుకు షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును కాంగ్రెస్ పెద్దలు నియమించిన సంగతి తెలిసిందే. సునీల్, షర్మిలల కాంబినేషన్లో ఏపీలో పార్టీకి పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఏది ఏమైనా షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తే వైసీపీ చిక్కులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on January 15, 2024 11:24 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…