వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, జాతీయ స్థాయిలో ఏఐసీసీ సభ్యురారిగా ఏదో ఒక హోదాలో ఆమెను నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాను అధిష్టానం అప్పగించిన బాధ్యతను అండమాన్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది.
తన పదవికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తాజాగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన పంపించారు. మణిపూర్ లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఏపీలో బలోపేతం చేసేందుకు షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును కాంగ్రెస్ పెద్దలు నియమించిన సంగతి తెలిసిందే. సునీల్, షర్మిలల కాంబినేషన్లో ఏపీలో పార్టీకి పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఏది ఏమైనా షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తే వైసీపీ చిక్కులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on January 15, 2024 11:24 pm
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…
మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…
నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…
నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…
జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…