Political News

షర్మిలకు లైన్ క్లియర్ చేసిన రుద్రరాజు

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, జాతీయ స్థాయిలో ఏఐసీసీ సభ్యురారిగా ఏదో ఒక హోదాలో ఆమెను నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాను అధిష్టానం అప్పగించిన బాధ్యతను అండమాన్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల కూడా ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది.
తన పదవికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తాజాగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన పంపించారు. మణిపూర్ లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఏపీలో బలోపేతం చేసేందుకు షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును కాంగ్రెస్ పెద్దలు నియమించిన సంగతి తెలిసిందే. సునీల్, షర్మిలల కాంబినేషన్లో ఏపీలో పార్టీకి పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఏది ఏమైనా షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తే వైసీపీ చిక్కులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Satya

Recent Posts

గ్రీన్ కార్డు గొప్ప‌లు వ‌ద్దు: సుప్రీంకోర్టు కొర‌డా ఇదిగో!

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం గ్రీన్ కార్డ్‌.. అత్యంత కీల‌కం. దీనిని సాధించ‌డ‌మే మ‌హా య‌జ్ఞం చేసినంత ప‌నిగా…

5 minutes ago

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

59 minutes ago

రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఏపీలో హాట్ టాపిక్‌!

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు త‌ప్ప‌దా? ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…

2 hours ago

డైరెక్టర్ల మార్పుపై ఓపెన్ అయిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…

3 hours ago

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…

4 hours ago

అనంత శ్రీరామ్… ఇదేం లాజిక్?

ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…

5 hours ago