వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, జాతీయ స్థాయిలో ఏఐసీసీ సభ్యురారిగా ఏదో ఒక హోదాలో ఆమెను నియమించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. తాను అధిష్టానం అప్పగించిన బాధ్యతను అండమాన్ లో అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల కూడా ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లుగా కనిపిస్తోంది.
తన పదవికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తాజాగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన పంపించారు. మణిపూర్ లో జరిగిన ఓ సమావేశం సందర్భంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఏపీలో బలోపేతం చేసేందుకు షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును కాంగ్రెస్ పెద్దలు నియమించిన సంగతి తెలిసిందే. సునీల్, షర్మిలల కాంబినేషన్లో ఏపీలో పార్టీకి పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఏది ఏమైనా షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తే వైసీపీ చిక్కులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on January 15, 2024 11:24 pm
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…