Political News

రెండు సీట్లపై రేవంత్ ప్రత్యేకంగా గురిపెట్టారా?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అన్నీ సీట్లను స్వీప్ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే రెండుసీట్లపైన రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టిపెట్టారట. ఇంతకీ ఆ రెండు సీట్లు ఏవంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలు. ఈ రెండు సీట్లపైనే రేవంత్ ఎందుకింత ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు ? ఎందుకంటే ఇవి రెండు రేవంత్ సొంత జిల్లాలోని రిజర్వుడు నియోజకవర్గాలు కావటమే కారణం. రేవంత్ ది మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ అని అందరికీ తెలిసిందే.

ఇపుడు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకనే తన జిల్లాలోని రెండు సీట్లను కచ్చితంగా గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక్కడ మరో కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ నియోజవర్గాల్లో కాంగ్రెస్ మ్యాగ్జిమమ్ స్వీప్ చేసేసింది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల హస్తంపార్టీ అభ్యర్ధులే గెలిచారు. కొంచెం కష్టపడుంటే మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్సే గెలిచుండేదని రిపోర్టు వచ్చింది. అందుకనే సీడ్బ్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడైన వంశీచంద్ రెడ్డితో రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యారు.

తొందరలోనే జిల్లాకు వచ్చి అన్నీ నియోజకవర్గాలపైన అక్కడే రివ్యూ చేస్తానని వంశీకి రేవంత్ చెప్పారట.  పార్లమెంటు అభ్యర్ధుల ఎంపిక, ఇప్పటికిప్పుడు భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాల్లో ఎంపిక చేయాల్సిన అభ్యర్ధులపైన చర్చించేందుకు రేవంత్ ఢిల్లీలో క్యాంపువేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లను గెలుచుకున్నది. బీజేపీ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడు సీట్లు గెలిచింది. హైదరాబాద్ సీటును ఎంఐఎం గెలుచుకున్నది.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగిలిన 16 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నది. అందుకనే ప్రతి నియోజకవర్గంపైన ఒకటికి రెండుమూడుసార్లు సర్వేలు చేయించుకుంటోంది. వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్, సునీల్ భేటీ అయ్యారు. మొత్తానికి  పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుకు రేవంత్ గట్టిగానే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. 

This post was last modified on January 15, 2024 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago