Political News

15 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు… జ‌న‌సేన‌కు తేలిన లెక్క‌!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్ల విష‌యాన్ని చంద్ర‌బాబు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. మొత్తం 175 స్థానాల అసెంబ్లీలో 15 స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీనిపై సుదీర్ఘంగా శ‌నివారం రాత్రంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా.. జ‌న‌సేన‌కు కేటాయించిన‌ట్టు తెలిసింది.

అదేవిధంగా జంపింగుల విష‌యం కూడా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం వైసీపీలో టికెట్లు ద‌క్క‌ని ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అయ్యారు. వీరిలో ఒక‌రు విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ‌యాద‌వ్ జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా మ‌చిలీప‌ట్నం నుంచి వ‌చ్చిన ఎంపీ బాల‌శౌరి త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం తీసుకోనున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌చిలీపట్నం టికెట్‌ను కూడా జ‌న‌సేన‌కు కేటాయించేందుకు చంద్ర‌బాబు అంగీక‌రించారు. ఈ రెండు స్థానాల‌తోపాటు.. పిఠాపురం, విజ‌య‌వాడ వెస్ట్‌, చీరాల‌, ద‌ర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూర‌ల్‌, తిరుపతి, మాడుగుల‌, పోల‌వ‌రం, పెడ‌న‌, నంద్యాల‌, అనంత‌పురం రూర‌ల్‌, ధ‌ర్మ‌వ‌రం, క‌ళ్యాణ‌దుర్గం, పూత‌ల‌ప‌ట్టు వంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించేందుకు చంద్ర‌బాబు దాదాపు అంగీకారం తెలిపిన‌ట్టు తెలిసింది. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌చిలీప‌ట్నం కేటాయించారు.

మ‌రో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంపై క‌స‌రత్తు చేసిన త‌ర్వాత‌.. కేటాయిస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల వివాదాలు రాకుండా.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌కుండా.. ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకుని.. అడుగులు వేయాల‌ని ఇరు పార్టీల అధినేత‌లు నిర్ణ‌యించారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బ‌తిన‌కుండా చూసుకోవాల‌ని నిర్ణ‌యించారు. బీజేపీ క‌లిసి వ‌స్తే.. అప్పుడు చూడాల‌ని.. లేక‌పోతే.. క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకొని ముందుకు వెళ్లాల‌ని తాజా చ‌ర్చ‌ల్లో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

This post was last modified on January 14, 2024 10:06 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago