Political News

15 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు… జ‌న‌సేన‌కు తేలిన లెక్క‌!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్ల విష‌యాన్ని చంద్ర‌బాబు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. మొత్తం 175 స్థానాల అసెంబ్లీలో 15 స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీనిపై సుదీర్ఘంగా శ‌నివారం రాత్రంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా.. జ‌న‌సేన‌కు కేటాయించిన‌ట్టు తెలిసింది.

అదేవిధంగా జంపింగుల విష‌యం కూడా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం వైసీపీలో టికెట్లు ద‌క్క‌ని ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అయ్యారు. వీరిలో ఒక‌రు విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ‌యాద‌వ్ జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా మ‌చిలీప‌ట్నం నుంచి వ‌చ్చిన ఎంపీ బాల‌శౌరి త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం తీసుకోనున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌చిలీపట్నం టికెట్‌ను కూడా జ‌న‌సేన‌కు కేటాయించేందుకు చంద్ర‌బాబు అంగీక‌రించారు. ఈ రెండు స్థానాల‌తోపాటు.. పిఠాపురం, విజ‌య‌వాడ వెస్ట్‌, చీరాల‌, ద‌ర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూర‌ల్‌, తిరుపతి, మాడుగుల‌, పోల‌వ‌రం, పెడ‌న‌, నంద్యాల‌, అనంత‌పురం రూర‌ల్‌, ధ‌ర్మ‌వ‌రం, క‌ళ్యాణ‌దుర్గం, పూత‌ల‌ప‌ట్టు వంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించేందుకు చంద్ర‌బాబు దాదాపు అంగీకారం తెలిపిన‌ట్టు తెలిసింది. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌చిలీప‌ట్నం కేటాయించారు.

మ‌రో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంపై క‌స‌రత్తు చేసిన త‌ర్వాత‌.. కేటాయిస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల వివాదాలు రాకుండా.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌కుండా.. ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకుని.. అడుగులు వేయాల‌ని ఇరు పార్టీల అధినేత‌లు నిర్ణ‌యించారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బ‌తిన‌కుండా చూసుకోవాల‌ని నిర్ణ‌యించారు. బీజేపీ క‌లిసి వ‌స్తే.. అప్పుడు చూడాల‌ని.. లేక‌పోతే.. క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకొని ముందుకు వెళ్లాల‌ని తాజా చ‌ర్చ‌ల్లో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

This post was last modified on January 14, 2024 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

59 minutes ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

1 hour ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

1 hour ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

3 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

3 hours ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

5 hours ago