వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేనకు ఇచ్చే సీట్ల విషయాన్ని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలిసింది. మొత్తం 175 స్థానాల అసెంబ్లీలో 15 స్థానాలను జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై సుదీర్ఘంగా శనివారం రాత్రంగా జరిగిన చర్చల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టు సమాచారం. అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలను కూడా.. జనసేనకు కేటాయించినట్టు తెలిసింది.
అదేవిధంగా జంపింగుల విషయం కూడా ఇరు పార్టీల నేతల మధ్య చర్చకు వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వైసీపీలో టికెట్లు దక్కని ఇద్దరు కీలక నాయకులు జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారు. వీరిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణయాదవ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా మచిలీపట్నం నుంచి వచ్చిన ఎంపీ బాలశౌరి త్వరలోనే జనసేన పార్టీ తీర్థం తీసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో మచిలీపట్నం టికెట్ను కూడా జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఈ రెండు స్థానాలతోపాటు.. పిఠాపురం, విజయవాడ వెస్ట్, చీరాల, దర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూరల్, తిరుపతి, మాడుగుల, పోలవరం, పెడన, నంద్యాల, అనంతపురం రూరల్, ధర్మవరం, కళ్యాణదుర్గం, పూతలపట్టు వంటి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు దాదాపు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో మచిలీపట్నం కేటాయించారు.
మరో పార్లమెంటు నియోజకవర్గంపై కసరత్తు చేసిన తర్వాత.. కేటాయిస్తామని చెప్పినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల వివాదాలు రాకుండా.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయకుండా.. ముందుగానే జాగ్రత్తలు తీసుకుని.. అడుగులు వేయాలని ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించారు. ముఖ్యంగా పొత్తులు దెబ్బతినకుండా చూసుకోవాలని నిర్ణయించారు. బీజేపీ కలిసి వస్తే.. అప్పుడు చూడాలని.. లేకపోతే.. కమ్యూనిస్టులను కలుపుకొని ముందుకు వెళ్లాలని తాజా చర్చల్లో ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
This post was last modified on January 14, 2024 10:06 am
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…