స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 50 రోజులపాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. అయితే, చంద్రబాబు అరెస్టు సమయంలో సెక్షన్ 17 ఏ ఆయనకు వర్తిస్తుందా లేదా అన్నదానిపై ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా వాడివేడి వాదనలు జరిగాయి.
ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబరు 20న ఇరుపక్షాల తుది వాదనలు విన్న సుప్రీం కోర్టు సెక్షన్ 17ఏ, క్వాష్ పిటిషన్ పై తుది తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జనవరి 16వ తేదీన ఈ వ్యవహారం పై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తన అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. 17 ఏ సెక్షన్ తనకు వర్తిస్తుందని, దానిని పాటించకుండానే అరెస్టు చేయడం సరికాదని ఆయన పిటిషన్ వేశారు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే, చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తించదని ఏపీ సిఐడి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 20న వాదనలు పూర్తయి తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16న జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసులో ఎటువంటి తీర్పు రాబోతుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
This post was last modified on January 14, 2024 2:02 am
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…