ఉమ్మడి గుంటూరు నియోజకవర్గంలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం ప్రత్తిపాడు. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న మేకతోటి సుచరిత.. హోం మంత్రిగా కూడా చేశారు. రెండో దఫా ఆమెను మంత్రి వర్గంనుంచి తప్పించారు. ఆది నుంచి ఈ నియోజకవర్గంలో మాల సామాజిక వర్గం సుచరిత వెంటే నడిచారు. అయితే.. ఇప్పుడు ఆమెను ఇక్కడ నుంచి తప్పించి తాడికొండకు మార్చారు.
ఈక్రమంలోనే మాదిగ సామాజిక వర్గానికి చెందిన బలసాని కిరణ్కుమార్కు పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించింది. ఇంతవరకు బాగానేఉన్నా.. ఆయన వ్యవహార శైలిపై మాల సామాజిక వర్గం నాయకులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన బలసాని.. గతంలో మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి.. తమ హక్కులు కాలరాయాలని చూశారని.. పాత సంగతులు తెరమీదికి తెస్తున్నారు.
ఇదేసమయంలో ఇటీవల చోటు చేసుకున్న రెండు పరిణామాల్లో మాదిగ కుటుంబాలను పరామర్శించిన బలసాని.. మాల సామాజిక వర్గంనాయకులు చనిపోతే.. కనీసం పట్టించుకోలేదని.. తమ గ్రామాలను కూడా ఆయన వదిలేశారని.. వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 45 వేల సంఖ్యలో ఉన్న మాల ఓటర్లను ఆయన చిన్నచూపు చూస్తున్నారని.. ఈ వర్గం నాయకులు ఖస్సు మంటున్నారు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన ప్రత్తిపాడు.. మాల సామాజిక వేదిక సమావేశంలో నాయకులు బలసాని వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో బలసానికి మద్దతు ఇచ్చే విషయంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. 27 వేల ఓట్లున్న మాదిగ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం సరికాదని.. 45 వేల పైచిలుకు ఉన్న మాల సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చేలా పార్టీపై ఒత్తిడి పెంచాలని కొందరు నాయకులు సూచించారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానాన్ని కలుసుకుని తమ డిమాండ్ వినిపించాలని లేకపోతే.. బలసానికి దూరంగా ఉండాలని కూడా నిర్ణయించడం.. ప్రత్తిపాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మరి దీనిపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on January 12, 2024 9:27 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…