Political News

వైసీపీ ఇన్ చార్జిల మూడో జాబితా ఇదే

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ వైసీపీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సర్వేల నివేదికలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తొలగిస్తూ వారి స్థానంలో కొత్త వారికి జగన్ చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే చీటింగ్ స్థానాలు కోల్పోయిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారు. మరికొందరు ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పునకు సంబంధించి మూడో జాబితాను వైసీపీ అధిష్టానం ఈ రోజు విడుదల చేసింది.

మొత్తం 21 మంది వైసీపీ నేతలకు మూడో జాబితాలో స్థానచలనం కలిగింది. ఇందులో 6 ఎంపీ స్థానాలు ఉండగా, 15 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఈ మొత్తం జాబితాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని హైలైట్ గా నిలిచారు. వైసీపీ తీర్థం పుచ్చుకోక ముందే ఆ పార్టీ తరఫున విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని నాని బరిలోకి దిగిబోతున్నట్లుగా వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. కేశినేని నాని రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఇంకా ఆమోదించలేదు. ఇక, టీడీపీ సభ్యత్వానికి చేసిన రాజీనామా కూడా ఆమోదించలేదు. టెక్నికల్ గా ఆయన వైసీపీలో చేరలేదు. ఇటువంటి సందర్భంలో కేశినేనిని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం విశేషం.

మరోవైపు, మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సిని విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. ఇక, తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి షాక్ ఇస్తూ అక్కడ కోనేటి ఆదిమూలం పేరును జాబితాలో చేర్చారు. గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్ సభ స్థానం ఇన్చార్జిగా నియమించారు. మంత్రి జోగి రమేష్ కు కూడా జగన్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందిన జోగి రమేష్ ను ఈసారి పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ నియమించారు. తాజాగా, మూడో జాబితా కూడా విడుదల నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

21 మంది ఇన్చార్జిల జాబితా….

లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జిలు

శ్రీకాకుళం – పెరాడ తిలక్
విశాఖపట్నం -బోత్స ఝాన్సీ లక్ష్మీ
ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ – కేశినేని నాని
కర్నూలు – గుమ్మనూరి జయరాం
తిరుపతి – కోనేటి ఆదిమూలం

అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జిలు

ఇచ్చాపురం – పిరియ విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి -కంభం విజయ రాజు
రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
దర్శి – బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతల పట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు – విజయానందరెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
రాజంపేట -ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు – బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ ) -మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేష్
పెడన – ఉప్పాల రాము

శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

This post was last modified on January 12, 2024 8:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

2 hours ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

4 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

5 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

6 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

7 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

8 hours ago