Political News

వైసీపీ ఇన్ చార్జిల మూడో జాబితా ఇదే

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ వైసీపీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సర్వేల నివేదికలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తొలగిస్తూ వారి స్థానంలో కొత్త వారికి జగన్ చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే చీటింగ్ స్థానాలు కోల్పోయిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారు. మరికొందరు ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పునకు సంబంధించి మూడో జాబితాను వైసీపీ అధిష్టానం ఈ రోజు విడుదల చేసింది.

మొత్తం 21 మంది వైసీపీ నేతలకు మూడో జాబితాలో స్థానచలనం కలిగింది. ఇందులో 6 ఎంపీ స్థానాలు ఉండగా, 15 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఈ మొత్తం జాబితాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని హైలైట్ గా నిలిచారు. వైసీపీ తీర్థం పుచ్చుకోక ముందే ఆ పార్టీ తరఫున విజయవాడ లోక్ సభ స్థానం నుంచి కేశినేని నాని బరిలోకి దిగిబోతున్నట్లుగా వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. కేశినేని నాని రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఇంకా ఆమోదించలేదు. ఇక, టీడీపీ సభ్యత్వానికి చేసిన రాజీనామా కూడా ఆమోదించలేదు. టెక్నికల్ గా ఆయన వైసీపీలో చేరలేదు. ఇటువంటి సందర్భంలో కేశినేనిని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం విశేషం.

మరోవైపు, మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సిని విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. ఇక, తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి షాక్ ఇస్తూ అక్కడ కోనేటి ఆదిమూలం పేరును జాబితాలో చేర్చారు. గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్ సభ స్థానం ఇన్చార్జిగా నియమించారు. మంత్రి జోగి రమేష్ కు కూడా జగన్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి గెలుపొందిన జోగి రమేష్ ను ఈసారి పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ నియమించారు. తాజాగా, మూడో జాబితా కూడా విడుదల నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన ఎమ్మెల్యేలు, ఎంపీల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

21 మంది ఇన్చార్జిల జాబితా….

లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జిలు

శ్రీకాకుళం – పెరాడ తిలక్
విశాఖపట్నం -బోత్స ఝాన్సీ లక్ష్మీ
ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ – కేశినేని నాని
కర్నూలు – గుమ్మనూరి జయరాం
తిరుపతి – కోనేటి ఆదిమూలం

అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జిలు

ఇచ్చాపురం – పిరియ విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి -కంభం విజయ రాజు
రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
దర్శి – బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతల పట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు – విజయానందరెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
రాజంపేట -ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు – బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ ) -మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేష్
పెడన – ఉప్పాల రాము

శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

This post was last modified on January 12, 2024 8:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago