Political News

వైసీపీలో మరో వికెట్..ఎంపీ బాలశౌరి ఔట్?

ఏపీలో శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో ముసలం ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తూ జగన్ రెండు లిస్ట్ లు విడుదల చేయడంతో టికెట్ దక్కని వారు పక్క పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకో ఎమ్మెల్యేనో, ఎంపీనో అన్నట్లు వైసీపీలో టపటపా వికెట్లు పడుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అదే బాటలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి బాలశౌరి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలి రెండు జాబితాలలో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో, పార్టీని వీడే జాబితాలో వారి సంఖ్య ఎక్కువుంది. కానీ, అనూహ్యంగా టికెట్ రాని, రాదని నమ్మకం ఉన్న ఎంపీలు కూడా ఒక్కొక్కరిగా పార్టీని వీడడం జగన్ కు షాకింగ్ అనే చెప్పవచ్చు. 2019లో మచిలీపట్నం లోక్ సభ బరిలో నిలిచి 60 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. అయితే, జగన్ మార్క్ సమీకరణాల రీత్యా ఆయనకు ఈ సారి టికెట్ దక్కలేదు. దీంతో, ఆయన పార్టీ వీడేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.

మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో బాలశౌరికి కొంతకాలంగా విభేదాలున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి విందుకు బాలశౌరి హాజరు కావడం జగన్‌ కు నచ్చలేదట. ఆ విందు తర్వాత బాలశౌరికి జగన్ క్లాస్ పీకి టికెట్ లేదన్నారట. దీంతో, జనసేనలోకి వెళ్లాలని బాలశౌరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి…పవన్ ను కోరారట.

అతి త్వరలోనే టీడీపీ-జనసేన కూటమిలో బాలశౌరి చేరబోతున్నారనే టాక్ వస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గాలలో ఏదో ఒకటి ఇవ్వాల్సిందిగా పవన్ ను అంబటి రాయుడు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ రెండు నియోజకవర్గాలలో ఒకదానిని బాల శౌరి కూడా కోరుతున్నారట.

This post was last modified on January 11, 2024 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

1 hour ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago