Political News

వైసీపీలో మరో వికెట్..ఎంపీ బాలశౌరి ఔట్?

ఏపీలో శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో ముసలం ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తూ జగన్ రెండు లిస్ట్ లు విడుదల చేయడంతో టికెట్ దక్కని వారు పక్క పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకో ఎమ్మెల్యేనో, ఎంపీనో అన్నట్లు వైసీపీలో టపటపా వికెట్లు పడుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అదే బాటలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి బాలశౌరి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలి రెండు జాబితాలలో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో, పార్టీని వీడే జాబితాలో వారి సంఖ్య ఎక్కువుంది. కానీ, అనూహ్యంగా టికెట్ రాని, రాదని నమ్మకం ఉన్న ఎంపీలు కూడా ఒక్కొక్కరిగా పార్టీని వీడడం జగన్ కు షాకింగ్ అనే చెప్పవచ్చు. 2019లో మచిలీపట్నం లోక్ సభ బరిలో నిలిచి 60 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. అయితే, జగన్ మార్క్ సమీకరణాల రీత్యా ఆయనకు ఈ సారి టికెట్ దక్కలేదు. దీంతో, ఆయన పార్టీ వీడేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.

మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో బాలశౌరికి కొంతకాలంగా విభేదాలున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి విందుకు బాలశౌరి హాజరు కావడం జగన్‌ కు నచ్చలేదట. ఆ విందు తర్వాత బాలశౌరికి జగన్ క్లాస్ పీకి టికెట్ లేదన్నారట. దీంతో, జనసేనలోకి వెళ్లాలని బాలశౌరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి…పవన్ ను కోరారట.

అతి త్వరలోనే టీడీపీ-జనసేన కూటమిలో బాలశౌరి చేరబోతున్నారనే టాక్ వస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గాలలో ఏదో ఒకటి ఇవ్వాల్సిందిగా పవన్ ను అంబటి రాయుడు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ రెండు నియోజకవర్గాలలో ఒకదానిని బాల శౌరి కూడా కోరుతున్నారట.

This post was last modified on January 11, 2024 3:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

33 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

52 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago