Political News

టికెట్ రాకుంటే 40 కోట్లు మిగిలినట్లే: దగ్గుబాటి

వైసీపీ మాజీ నేత, సీనియర్ పొలిటిషన్ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో తాను వైసీపీ నుంచి ఓటమిపాలు కావడమే మంచిదయిందని, లేదంటే తన నియోజకవర్గ ప్రజలు తనను అభివృద్ధి చేయలేదని నిలదీసేవారని దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఆ వ్యాఖ్యల వేడి తగ్గక ముందే తాజాగా ఆయన మరోసారి వైసీపీని పరోక్షంగా దుయ్యబట్టారు.

రాబోయే ఎన్నికల్లో టికెట్ రానివారు అదృష్టవంతులు అంటూ దగ్గుబాటి చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టికెట్ రాని వాళ్ళకు 30-40 కోట్లు మిగిలినట్టేనని అన్నారు. జీవితంలో వారు సంపాదించింది అంతా ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అన్నారు. ఇక, ఎమ్మెల్యేలు సంపాదించిన డబ్బు మొత్తం ఓ ఖజానాకే చేరుతుందని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి కామెంట్లు చేశారు. ఓడిన వాడు అక్కడే ఏడుస్తాడని, గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడని సెటైర్లు వేశారు. నిజమైన ప్రజాప్రతినిధులను భగవంతుడే కాపాడాలని దగ్గుబాటి అన్నారు.

రాబోయే ఎన్నికల్లో తాను, తన కుమారుడు హితేష్ పోటీ చేయడం లేదని క్లారిటీనిచ్చారు. 30-40 కోట్లు పెట్టి గెలిచిన తర్వాత డబ్బులు సంపాదించే అవకాశాలు ఇప్పుడు పెద్దగా లేవని చెప్పుకొచ్చారు. గతంలో పెట్టిన డబ్బులు సంపాదించేందుకు కొంత అవకాశం ఉండేదని, ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోందని, పార్టీ అధిపతి…ఎమ్మెల్యేలను ఎంపీలను ఉత్సవ విగ్రహాలు చేశారని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మద్యం, మైనింగ్ వంటి వ్యవహారాల్లో లక్షల కోట్లు దోచుకుంటున్నారని, దేశంలో సింగిల్ మాన్ పార్టీలు మొత్తం ఇలాగే నడుస్తున్నాయని అన్నారు.

ఇక, డబ్బులు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలన్నట్లుగా రాజకీయ వ్యవస్థ మారిపోయిందని, ప్రస్తుతం రాజకీయాలు గౌరవప్రదంగా లేవని దగ్గుబాటి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు ఊరికి సేవ చేసి గౌరవప్రదంగా బతికే వారిని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా అని తలలు బాదుకుంటున్నారని చెప్పారు.

This post was last modified on January 10, 2024 10:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫర్ ద ఫస్ట్ టైమ్.. పెళ్లి మండపంగా రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…

1 hour ago

వరుసబెట్టి 8 సార్లు!… రికార్డుల నిర్మలమ్మ!

మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…

1 hour ago

12 ఏళ్ళ రీమేక్ ఇప్పుడెందుకు స్వామి

నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…

1 hour ago

హైదరాబాద్ లో 9 రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…

1 hour ago

శేఖర్ కమ్ముల కాంప్రోమైజ్ అవ్వట్లేదు

నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…

2 hours ago

ఈ ఎమ్మెల్యే నిజంగానే ‘వెండి’ కొండ

జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…

2 hours ago