Political News

లోకేష్ నన్ను కొట్టించాలని చూశాడు: కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం కొద్దిరోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నాని ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నానని ప్రకటించడం సంచలనం రేపింది. రాబోయే ఎన్నికల్లో నానికి టికెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో తన పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నానని నాని ప్రకటించారు. దీంతో నాని వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే తాజాగా తాను వైసీపీలో చేరబోతున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.

క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో నాని భేటీ అయ్యారు. కూతురు కేశినేని శ్వేతతో కలిసి జగన్ ను నాని కలిశారు. జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నాని….చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు మోసగాడని ప్రపంచానికి తెలుసని, కానీ మరీ ఇంత పచ్చి మోసగాడు, దగా చేస్తాడు అని తెలియదని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాను ఎంపీనని, తనకున్న ప్రోటోకాల్ ను టిడిపి మర్చిపోయిందని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందిన వెంటనే వైసీపీలో చేరతానని నాని ప్రకటించారు. విజయవాడ అంటే ప్రాణం అని, బెజవాడ కోసం ఏదైనా చేస్తానని నాని అన్నారు. 2014 నుంచి 19 మధ్యలో బెజవాడ కోసం చంద్రబాబు 100 కోట్లు ఇచ్చాడని ప్రశ్నించారు. విజయవాడ రియాల్టీ అని, అమరావతి ఒక కలని అన్నారు. చంద్రబాబును ఎప్పుడు తాను టికెట్ అడగలేదని, ఇప్పుడు జగన్ ను కూడా అడగబోనని అన్నారు.

ప్రస్తుతం జగన్ తో ప్రయాణం చేయాలనుకుంటున్నానని, రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా టిడిపి 60 శాతం ఖాళీ కాబోతోందని నాని జోస్యం చెప్పారు. గతంలో టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడితో తనను తిట్టించారని, చెప్పు తీసుకొని కొడతానని, క్యారెక్టర్ లెస్ ఫెలో అని తిట్టినా పార్టీ స్పందించలేదని, గొట్టం గాడు అన్నా భరించానని అన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబు నిర్ణయించారని, కానీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తనను కొందరు తిట్టించారని ఆరోపించారు. తనను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదని వాపోయారు. పార్టీలో నుంచి వెళతానని చంద్రబాబుతో చెబితే నువ్వు ఉండాల్సిందే అని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

తాను 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నానని, టీడీపీ కోసం డబ్బు సమయం వృధా చేయొద్దని చాలామంది ముందే చెప్పినా తాను వినలేదని అన్నారు. తన కుటుంబ సభ్యులతో తనను కొట్టించాలని లోకేష్ చూశారని సంచలన ఆరోపణ చేశారు. మరి, తాజాగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలస్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, వైసీపీలో చేరేందుకు నాని కొన్ని షరతులు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది. తనకు విజయవాడ ఎంపీ టికెట్, తన కూతురు శ్వేతకు విజయవాడ ఈస్ట్ టికెట్, ఎంఎస్ బేగ్ కు విజయవాడ వెస్ట్ టికెట్, నందిగామ టికెట్ ను కన్నెగంటి జీవరత్నంకు, తిరువూరు టికెట్ నల్లగట్ల స్వామి దాసులకు కేటాయించాలని, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు టికెట్ ఇవ్వాలని నాని అడిగినట్లుగా తెలుస్తోంది.

This post was last modified on January 10, 2024 7:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

8 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago