Political News

రేవంత్ కేబినెట్ ఇకపై కింగ్ సైజ్

ఈనెలాఖరులో క్యాబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రేవంత్ కాకుండా 11మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అంటే మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశముంది. ఇపుడున్న మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీల నుండి ప్రాతినిద్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తరపున పోటీచేసిన మైనారిటి నేతలంతా ఓడిపోయారు కాబట్టే. ఓడిపోయిన వారిలో షబ్బీర్ ఆలీ, మహ్మడ్ అజహరుద్దీన్ ముఖ్యులు.

అందుకనే మంత్రివర్గాన్ని విస్తరించి మైనారిటిల నుండి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వాలని రేవంత్ అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు ముఖ్యులకు చెబితే వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈమధ్య తరచూ ఢిల్లీకి వెళుతున్న రేవంత్ మంత్రవర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. అలాగే ఎవరెవరిని తీసుకోవాలనే విషయాన్ని కూడా చర్చించినట్లు పార్టీవర్గాల సమాచారం. కాకపోతే కొన్ని పేర్లు విషయంలో ఇటు రేవంత్ అంటు ఐఏసీసీ ఏకాబిప్రాయానికి రాలేదట.

మైనారిటీలను మంత్రివర్గంలోకి తీసుకోవటం వరకు ఓకేనే. కానీ ఎవరిని తీసుకోవాలన్నదే సమస్యగా మారింది. ఎందుకంటే షబ్బీర్ లేదా అజహరుద్దీన్ లో ఒకళ్ళని తీసుకోవాలని రేవంత్ అనుకుంటున్నారట. అయితే ఓడిపోయిన వాళ్ళకి ఎంఎల్సీలు ఇవ్వకూడదన్నది పార్టీ గతంలో పెట్టుకున్న నియమం. ఇపుడు పై ఇద్దరిలో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నా వాళ్ళని ఎంఎల్సీలుగా చేయాలి. ఎంఎల్ఏలుగా పోటీచేసి ఓడిపోయిన వాళ్ళకే మళ్ళీ ఎంఎల్సీ పదవులిచ్చి మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోవాలన్నది ఏఐసీసీ ముఖ్యలు ప్రశ్న. అసలు పోటీకే అవకాశం దక్కని మైనారిటీల్లో నుండి ఎవరినైనా తీసుకోవచ్చని ఢిల్లీ నేతలు సూచిస్తున్నారట.

అయితే ఎవరికో ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవటం రేవంత్ కు ఇష్గంలేదట. రేవంత్ చూపంతా పై ఇద్దరిపైనే ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. అందుకనే ఈనెలాఖరులోగా మంత్రివర్గాన్ని విస్తరిస్తే మైనారిటీల్లో సానుకూలత మరింత పెంచుకోవాలన్నది రేవంత్ ఆలోచన. మరి మైనారిటి కోటాలో మంత్రయ్యే అదృష్టయోగం ఎవరికి ఉందో చూడాల్సిందే.

This post was last modified on January 9, 2024 12:18 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

28 mins ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

39 mins ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

2 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

2 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

3 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

3 hours ago