నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్ది నెలల క్రితం వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీపై, సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై కోటంరెడ్డి సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి…తమ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. తాజాగా, చంద్రబాబు గురించి కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, టీడీపీ అధికారం చేపడుతుందని కోటంరెడ్డి జోస్యం చెప్పారు.
ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చిన జగన్ మరో చేత్తో 100 రూపాయలు లాగేసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ పొరపాటున మరోసారి అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితులు లేవని కోటంరెడ్డి విమర్శించారు. ఏపీలో కరెంట్ బిల్లులు పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొడుతోందని సెటైర్లు వేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్న క్యాంటీన్లు పునః ప్రారంభమవుతాయని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ‘అమ్మ క్యాంటీన్ల’ను కొనసాగిస్తున్నారని, జగన్ కనీసం పేరు మార్చైనా అన్నా క్యాంటీన్లను కొనసాగించాల్సిందని చెప్పుకొచ్చారు.
పేదల కడపుకొట్టడం సమంజసం కాదని జగన్ కు హితవు పలికారు. 35 ఏళ్లుగా క్వార్జ్ కు సరైన ధర లేక వ్యాపారులు ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో దానికి మంచి రేటు పలుకుతోందని చెప్పారు. ఇటువంటి సందర్భంలో గనులకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల క్వార్ట్జ్ వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on January 8, 2024 10:27 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…