Political News

కాబోయే సీఎం చంద్రబాబే: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్ది నెలల క్రితం వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీపై, సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై కోటంరెడ్డి సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి…తమ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. తాజాగా, చంద్రబాబు గురించి కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, టీడీపీ అధికారం చేపడుతుందని కోటంరెడ్డి జోస్యం చెప్పారు.

ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చిన జగన్ మరో చేత్తో 100 రూపాయలు లాగేసుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ పొరపాటున మరోసారి అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితులు లేవని కోటంరెడ్డి విమర్శించారు. ఏపీలో కరెంట్ బిల్లులు పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొడుతోందని సెటైర్లు వేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్న క్యాంటీన్లు పునః ప్రారంభమవుతాయని చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ‘అమ్మ క్యాంటీన్ల’ను కొనసాగిస్తున్నారని, జగన్ కనీసం పేరు మార్చైనా అన్నా క్యాంటీన్లను కొనసాగించాల్సిందని చెప్పుకొచ్చారు.

పేదల కడపుకొట్టడం సమంజసం కాదని జగన్ కు హితవు పలికారు. 35 ఏళ్లుగా క్వార్జ్ కు సరైన ధర లేక వ్యాపారులు ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో దానికి మంచి రేటు పలుకుతోందని చెప్పారు. ఇటువంటి సందర్భంలో గనులకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల క్వార్ట్జ్ వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపిలో చేరబోతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on January 8, 2024 10:27 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

43 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

1 hour ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago