Political News

వైఎస్ మ‌ర‌ణం వెనుక కాంగ్రెస్‌.. ష‌ర్మిల వెనుక చంద్ర‌బాబు: స‌జ్జ‌ల

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంద‌ని, దీనిపై త‌మ‌కు అప్ప‌టి నుంచే అనుమానాలు ఉన్నాయ‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై గ‌తంలో తాము విచార‌ణ‌కు కూడా డిమాండ్ చేశామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ ఆవేద‌న అర‌ణ్య రోద‌న‌గానే మిగిలిపోయింద‌న్నారు. ఇక‌, తాజాగా వైఎస్ కుమార్తె ష‌ర్మిల త‌న పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం.. ఆ పార్టీతో చేతులు క‌ల‌ప‌డం పైనా స‌జ్జ‌ల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేర‌డం, త‌న పార్టీని విలీనం చేయ‌డం వెనుక టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నార‌ని.. ఆయ‌న కుట్ర‌లో భాగంగానే ఆమె కాంగ్రెస్‌తో చేతులు క‌లిపార‌ని స‌జ్జ‌ల విమ‌ర్శ‌లు గుప్పించారు. వైఎస్ కుటుంబాన్ని రాచి రంపాన పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. సీఎం జ‌గ‌న్‌పై అనేక కేసులు పెట్టించి.. జైల్లోకి కూడా నెట్టిన పార్టీ కాంగ్రెస్‌యేన‌ని ఆయ‌న చెప్పారు. కాంగ్రెస్ తో కేసులు పెట్టించ‌డం వెనుక చంద్ర‌బాబు హ‌స్తం కూడా ఉంద‌న్నారు. ఇప్పుడు ఏపీలో సీఎం జ‌గ‌న్‌ను, వైసీపీని దెబ్బ తీసేందుకు.. వ్యూహాత్మ‌కంగా ష‌ర్మిల‌ను కాంగ్రెస్‌తో క‌లిపార‌ని అన్నారు.

త‌న వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు చంద్ర‌బాబు ఇత‌రుల‌ను వాడుకుంటార‌ని స‌జ్జ‌ల ఆరోపించారు. ఇప్పుడు ష‌ర్మిల వ్య‌వ‌హారం కూడా దీనిలో భాగ‌మేన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంక్షేమం పేరుతో చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో పోటీ ప‌డాల‌ని సూచించారు. ఇదే జ‌రిగితే.. ఆయ‌న ఓట‌మి ఖాయ‌మ‌ని చెప్పారు. షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోమని తెలిపారు.

ఎస్మా కాక ఏం చేస్తాం!

రాష్ట్రంలో గ‌త 22 రోజులుగా ఉద్య‌మిస్తున్న అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సమంజసమేనని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. ఎస్మా ప్ర‌యోగించ‌క తాము ఏం చేస్తామ‌న్నారు. అంగన్వాడీల సమ్మెతో చిన్నపిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారని.. వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీలు ఉన్నారని.. వారు తిరిగి వీధుల్లో చేరాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. అయినా వారు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని.. అందుకే ఎస్మా చట్టాన్ని ప్రయోగించామన్నారు. దీనిని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

1 hour ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago