దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని, దీనిపై తమకు అప్పటి నుంచే అనుమానాలు ఉన్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై గతంలో తాము విచారణకు కూడా డిమాండ్ చేశామన్నారు. అయినప్పటికీ.. తమ ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయిందన్నారు. ఇక, తాజాగా వైఎస్ కుమార్తె షర్మిల తన పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం.. ఆ పార్టీతో చేతులు కలపడం పైనా సజ్జల తీవ్ర విమర్శలు గుప్పించారు.
షర్మిల కాంగ్రెస్లో చేరడం, తన పార్టీని విలీనం చేయడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని.. ఆయన కుట్రలో భాగంగానే ఆమె కాంగ్రెస్తో చేతులు కలిపారని సజ్జల విమర్శలు గుప్పించారు. వైఎస్ కుటుంబాన్ని రాచి రంపాన పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్పై అనేక కేసులు పెట్టించి.. జైల్లోకి కూడా నెట్టిన పార్టీ కాంగ్రెస్యేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తో కేసులు పెట్టించడం వెనుక చంద్రబాబు హస్తం కూడా ఉందన్నారు. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ను, వైసీపీని దెబ్బ తీసేందుకు.. వ్యూహాత్మకంగా షర్మిలను కాంగ్రెస్తో కలిపారని అన్నారు.
తన వ్యూహాలను అమలు చేసేందుకు చంద్రబాబు ఇతరులను వాడుకుంటారని సజ్జల ఆరోపించారు. ఇప్పుడు షర్మిల వ్యవహారం కూడా దీనిలో భాగమేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమం పేరుతో చంద్రబాబు ఎన్నికల్లో పోటీ పడాలని సూచించారు. ఇదే జరిగితే.. ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోమని తెలిపారు.
ఎస్మా కాక ఏం చేస్తాం!
రాష్ట్రంలో గత 22 రోజులుగా ఉద్యమిస్తున్న అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం సమంజసమేనని సజ్జల వ్యాఖ్యానించారు. ఎస్మా ప్రయోగించక తాము ఏం చేస్తామన్నారు. అంగన్వాడీల సమ్మెతో చిన్నపిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారని.. వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీలు ఉన్నారని.. వారు తిరిగి వీధుల్లో చేరాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. అయినా వారు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని.. అందుకే ఎస్మా చట్టాన్ని ప్రయోగించామన్నారు. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.
This post was last modified on January 6, 2024 7:16 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…