విజయవాడ పార్లమెంటు స్థానం విషయంలో టీడీపీలో నెలకొన్న విభేదాలకు చెక్ పెడుతూ.. ఆ పార్టీ అధి నేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీ టికెట్ ఖరారైనట్టు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ కీలక నాయకులు ఎంపీ నానికి సైతం చేరవేసినట్టు తెలిసింది. అంతేకాదు.. ఇటీవల ఘర్షణ జరిగిన తిరువూరు నియోజకవర్గానికి కూడా నానిని దూరం పెట్టారు.
ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ నానికి పార్టీ నేతలు సమాచారం అందించారు. దీంతో ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. తాను తిరువూరు సభకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. అదేసమయంలో వేరేవారికి విజయవాడ సీటు కేటాయించడంపై తనకు ఎలాంటి అబ్యంతరం లేదని నాని చెప్పుకొచ్చారు. అయితే అధిష్టానం నిర్ణయాన్ని మాత్రం శిరసావహిస్తానని నాని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే.. ఎంపీ టికెట్ వ్యవహారంపై.. కొన్నాళ్లుగా వివాదంగా మారిన విషయం తెలిసిందే.
ఎంపీ వర్సెస్ సొంత తమ్ముడి చుట్టూ రాజకీయాలు సాగాయి. ఇరువురూ బహిరంగ విమర్శలు చేసుకోకపో యినా.. అంతర్గత కుమ్ములాటలతో విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు విజయవాడలో కేడర్ అంతా కూడా ఎంపీకి దూరమయ్యారనేది తెలిసిందే. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వంటివారు ఎంపీ నానిని కొన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు తప్ప.. ఎవరికి టికెట్ ఇచ్చినా.. తమకు ఓకే అంటూ కొన్నాళ్లుగా చెబుతున్నారు. ఈ పరిణామాలకు తోడు చిన్ని నిత్యం ప్రజల్లో ఉండడం కూడా పార్టీకి కలిసి వచ్చింది.
మొత్తంగా ఎంపీ అభ్యర్థిని మారుస్తూ.. పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, దీనినిఅధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. నానికి ఉన్న బలం.. ఆర్థికంగా, కేడర్ పరంగా చిన్నికి లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో రాజకీయంగా ఇది దుమారం రేపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకో వైపు నాని వైసీపీ వైపు అడుగులు వేస్తే.. ఆయనకు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇదే జరిగితే.. విజయవాడ ఎంపీ సీటు మరింత గరంగరంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on January 5, 2024 4:01 pm
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…