Political News

జగన్ సర్కారును వదలని నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు మధ్య నెలకొన్న వివాదం ఒక పట్టాన తెగేలా లేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ తనపై వేటు వేయడాన్ని కోర్టులో సవాలు చేసి.. మళ్లీ పదవిలోకి రాగలిగారు రమేష్ కుమార్. అంతటితో ఈ వ్యవహారానికి తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. రమేష్ కుమార్ మరోసారి హైకోర్టు గడప తొక్కడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుంటోందంటూ ఆయన ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు కేసులు వేస్తూ ఎన్నికల సిబ్బందిని వేధిస్తున్నారన్న రమేష్ కుమార్.. తమపై సీఐడి పెట్టిన కేసులను కొట్టి వేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కూడా కోర్టును అభ్యర్థించారు.

రమేష్ కుమార్ తన పిటిషన్లో హోం కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఐడీలను ప్రతివాదులుగా చేర్చారు. రమేష్ కుమార్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సహాయ కార్యదర్శి సాంబమూర్తి సైతం జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కోర్టులో మరో పిటిషన్ వేయడం గమనార్హం. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారించనుంది. వివిధ వ్యవహారాల్లో కోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకోవడం అలవాటైన జగన్ సర్కారుకు ఈ కేసుల్లో ఎలాంటి ఆదేశాలు అందుతాయో చూడాలి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది మార్చి మూడో వారంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రమేష్ కుమార్ వాయిదా వేయడంతో వివాదం రాజుకుంది. ఆయన మీద జగన్ సహా వైకాపా నేతలు అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. రమేష్‌కు కులం ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్ అండ్ కో. తర్వాత ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ఆయన్ని పదవి నుంచి తప్పించారు. ఐతే కొన్ని నెలల పాటు కోర్టులో పోరాడి రమేష్ మళ్లీ పదవిలో కూర్చున్నారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వంతో ఆయనకు రగడ మొదలైంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

This post was last modified on September 3, 2020 9:02 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago