Political News

కరోనా టైం..ప్రపంచంలో బెస్ట్ థింకర్ గా భారతీయురాలు

ప్రచారం, హంగు, ఆర్భాటాలే పరమావధిగా ఉన్న ఈ జమానాలోనూ ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్…అన్న మాటలను నమ్మిన పొలిటిషియన్లు కూడా ఉన్నారు. అటువంటి రాజకీయ నేతలలో ముందు వరుసలో కేరళ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కే.కే. శైలజ ఉంటారు. కరోనా విపత్తు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆ మహమ్మారిని ముందుగానే గుర్తించారు శైలజ. గుర్తించడమే కాదు….కరోనా కట్టడిలో ఏ మాత్రం అలసత్వ ప్రదర్శించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కేరళలో కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించారు శైలజ. అందుకే, ఆమె కరోనా సంక్షోభంలో ప్రపంచంలోని టాప్ -50 థింకర్స్ లో నంబర్ వన్ గా నిలిచారు.

కేరళ ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో శైలజదే కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. అందుకే, కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవటంలో కేరళ ప్రభుత్వం, శైలజ కృషిని ఐక్యరాజ్యసమితి గతంలో కొనియాడింది. శైలజతో పాటు ఇతర నాయకులను పబ్లిక్‌ సర్వీస్‌ డే పురస్కరించుకుని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఆన్ లైన్ లో అభినందించారు. ఈ రకంగా భారతీయులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన శైలజ తాజాగా మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. బ్రిటన్‌లోని ప్రముఖ మ్యాగజైన్ ప్రాస్పెక్ట్‌ నిర్వహించిన `ప్రపంచంలోని టాప్-50‌ థింకర్స్‌ సర్వేలో శైలజ నంబర్ వన్ గా నిలిచి మరోసారి భారతీయులు గర్వపడేలా చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విశేష కృషి చేసిన వారిలో టాప్-50 మంది ఎవరో తెలుసుకునేందుకు బ్రిటన్‌లోని ప్రాస్పెక్ట్‌ మ్యాగజైన్‌ ఓ సర్వే నిర్వహించింది. కరోనా సంక్షోభం సందర్భంగా తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి…అలుపెరుగని పోరాటం చేసిన 50 మంది బెస్ట్‌ థింకర్స్‌ ఎవరు అన్నదానిపై సర్వే చేసింది. లక్షల మంది పాల్గొన్న ఆ పోల్‌లో శైలజ మొదటి స్థానం దక్కించుకున్నారు. కరోనా కట్టడిలో విజయం సాధించిన న్యూజీలాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెన్‌ ను వెనక్కు నెట్టి శైలజ నంబర్ వన్ గా నిలవడం విశేషం. టాప్‌ -50లో శైలజ మొదటి స్థానంలో నిలవగా, ఆర్డెన్ రెండో స్థానంలో ఉన్నారు.

టీచర్‌గానే సుప్రసిద్ధురాలైన శైలజ వామపక్ష నేతగానూ గుర్తింపు పొందారు. అందుకే, కరోనా విషయంలో అలసత్వం ప్రదర్శించలేదు. అనవసర ఆర్భాటాలకు, ప్రచారాలకు పోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన టెస్ట్‌, ట్రేస్‌, ఐసోలేట్‌ను అక్షరాలా పాటించారు. ఎయిర్‌పోర్టులలో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించి….చైనా నుంచి వచ్చేవారిపై ఫోకస్ పెట్టారు. క్వారంటైన్‌, సోషల్ డిస్టెన్సింగ్‌, మాస్కులు వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు. కరోనా విపత్తు కంటే ముందు నిఫా వైరస్‌, 2018-19 సంవత్సరాలలో వచ్చిన రెండు వరదలను ఎదుర్కోవటంలోనూ శైలజ నేతృత్వంలోని ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించింది. ఆ అనుభవమే కోవిడ్‌-19 నియంత్రణ కోసం ఉపయోగపడిందంటారు శైలజ. భారతీయులందరినీ గర్వపడేలా చేసిన శైలజ మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలకు ఆదర్శం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

This post was last modified on September 3, 2020 8:53 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ప్యారడైజ్ కోసం పీపుల్స్ స్టార్ ఒప్పుకుంటారా

ఇటీవలే విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ తో ది ప్యారడైజ్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారిపోయింది. రెండు…

45 seconds ago

అవతార్ పేరిచ్చింది బాలీవుడ్ హీరోనా

ప్రపంచ చరిత్రలో అత్యుత్తమ సినిమాల గురించి జాబితా రాస్తే టాప్ 10లో ఖచ్చితంగా ఉండే పేరు అవతార్. 2009 లో…

19 minutes ago

వర్మ అసంతృప్తి లేదంటున్నా.. ప్రచారం మాత్రం ఆగట్లేదు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు ముగిసింది. సోమవారంతో నామినేషన్లకు గడువు కూడా ముగిసిపోయింది. అభ్యర్థుల…

21 minutes ago

ఆ ఒక్క మాట కేటీఆర్ ను ఇరికించేసింది!

నిజమే… కేవలం ఒక్క మాట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను అడ్డంగా బుక్…

1 hour ago

బాబు కే రూల్స్.. బోరుగ‌డ్డ కు లేవు

ఇంటిని దొంగ‌ను ఈశ్వ‌రుడు కూడా ప‌ట్ట‌లేడ‌న్న సామెత బోరుగ‌డ్డ అనిల్ కుమార్ విష‌యంలో రుజువు అవుతోంది. వైసీపీకి అనుకూలంగా ప‌నిచేసే…

2 hours ago

మళ్లీ చిక్కుల్లో లలిత్ మోడీ… వనౌటు నిర్ణయంతో అష్టకష్టాలు!

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా వనౌటు ప్రభుత్వం అతనికి మంజూరైన పాస్‌పోర్టును రద్దు చేయాలని…

2 hours ago