Political News

జ‌న‌సేన లెక్క‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పంచింది 1.28 కోట్లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో చేసిన ఆర్థిక సాయంపై ఆ పార్టీ లెక్క‌లు చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోటీ 28 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పంపిణీ చేసిన‌ట్టు తెలిపింది. వీటిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబ‌రు మ‌ధ్య కాలంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన‌ప్పుడు.. ఆయా కుటుంబాల‌కు రూ. ల‌క్ష చొప్పున పంపిణీ చేశార‌ని తెలిపింది. ఇలా.. మొత్తం 73 కుటుంబాల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించార‌ని.. ఆయా కుటుంబాల‌కు ల‌క్ష చొప్పున ఇచ్చార‌ని పేర్కొంది.

ఇక‌, ఈ ఏడాది కాలంలో జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం లేదా.. స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు వ‌స్తూ.. ప్ర‌మాదాయాల్లో గాయ‌ప‌డి మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు కూడా ప‌వ‌న్ ఆర్థిక సాయం అందించార‌ని తెలిపింది. మొత్తం 11 మంది కార్య‌క‌ర్త‌లు.. రోడ్డు ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయార‌ని.. వీరికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున మొత్తం 55 ల‌క్ష‌లను ఆయా కుటుంబాల‌కు ఆర్థిక సాయంగా అందించిన‌ట్టు పేర్కొంది.

తాజా సాయం ఇదే..

ఈ ఏడాది వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది జ‌న‌సేన క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.55 లక్షల ఆర్థిక సహాయాన్ని ప‌వ‌న్ అందించారు.   కుటుంబ సభ్యులకు ఆయా బీమా చెక్కులను అందజే శారు. సాయం పొందిన వారు పవన్ ఆర్థిక సాయం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మరికొంత మంది అయితే జనసేన అధినేత సాయం పట్ల భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటలోను జనసేన పార్టీ అధికారిక ఖాతాల ద్వారా సోషల్ మీడియాలో పెట్టింది.  

This post was last modified on December 31, 2023 1:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago