Political News

జ‌న‌సేన లెక్క‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పంచింది 1.28 కోట్లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో చేసిన ఆర్థిక సాయంపై ఆ పార్టీ లెక్క‌లు చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోటీ 28 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పంపిణీ చేసిన‌ట్టు తెలిపింది. వీటిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబ‌రు మ‌ధ్య కాలంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన‌ప్పుడు.. ఆయా కుటుంబాల‌కు రూ. ల‌క్ష చొప్పున పంపిణీ చేశార‌ని తెలిపింది. ఇలా.. మొత్తం 73 కుటుంబాల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించార‌ని.. ఆయా కుటుంబాల‌కు ల‌క్ష చొప్పున ఇచ్చార‌ని పేర్కొంది.

ఇక‌, ఈ ఏడాది కాలంలో జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం లేదా.. స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు వ‌స్తూ.. ప్ర‌మాదాయాల్లో గాయ‌ప‌డి మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు కూడా ప‌వ‌న్ ఆర్థిక సాయం అందించార‌ని తెలిపింది. మొత్తం 11 మంది కార్య‌క‌ర్త‌లు.. రోడ్డు ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయార‌ని.. వీరికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున మొత్తం 55 ల‌క్ష‌లను ఆయా కుటుంబాల‌కు ఆర్థిక సాయంగా అందించిన‌ట్టు పేర్కొంది.

తాజా సాయం ఇదే..

ఈ ఏడాది వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది జ‌న‌సేన క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.55 లక్షల ఆర్థిక సహాయాన్ని ప‌వ‌న్ అందించారు.   కుటుంబ సభ్యులకు ఆయా బీమా చెక్కులను అందజే శారు. సాయం పొందిన వారు పవన్ ఆర్థిక సాయం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మరికొంత మంది అయితే జనసేన అధినేత సాయం పట్ల భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటలోను జనసేన పార్టీ అధికారిక ఖాతాల ద్వారా సోషల్ మీడియాలో పెట్టింది.  

This post was last modified on December 31, 2023 1:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago