Political News

జ‌న‌సేన లెక్క‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు పంచింది 1.28 కోట్లు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో చేసిన ఆర్థిక సాయంపై ఆ పార్టీ లెక్క‌లు చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ త‌ర‌ఫున ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోటీ 28 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పంపిణీ చేసిన‌ట్టు తెలిపింది. వీటిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబ‌రు మ‌ధ్య కాలంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన‌ప్పుడు.. ఆయా కుటుంబాల‌కు రూ. ల‌క్ష చొప్పున పంపిణీ చేశార‌ని తెలిపింది. ఇలా.. మొత్తం 73 కుటుంబాల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శించార‌ని.. ఆయా కుటుంబాల‌కు ల‌క్ష చొప్పున ఇచ్చార‌ని పేర్కొంది.

ఇక‌, ఈ ఏడాది కాలంలో జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం లేదా.. స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కు వ‌స్తూ.. ప్ర‌మాదాయాల్లో గాయ‌ప‌డి మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు కూడా ప‌వ‌న్ ఆర్థిక సాయం అందించార‌ని తెలిపింది. మొత్తం 11 మంది కార్య‌క‌ర్త‌లు.. రోడ్డు ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయార‌ని.. వీరికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున మొత్తం 55 ల‌క్ష‌లను ఆయా కుటుంబాల‌కు ఆర్థిక సాయంగా అందించిన‌ట్టు పేర్కొంది.

తాజా సాయం ఇదే..

ఈ ఏడాది వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 11 మంది జ‌న‌సేన క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.55 లక్షల ఆర్థిక సహాయాన్ని ప‌వ‌న్ అందించారు.   కుటుంబ సభ్యులకు ఆయా బీమా చెక్కులను అందజే శారు. సాయం పొందిన వారు పవన్ ఆర్థిక సాయం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మరికొంత మంది అయితే జనసేన అధినేత సాయం పట్ల భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటలోను జనసేన పార్టీ అధికారిక ఖాతాల ద్వారా సోషల్ మీడియాలో పెట్టింది.  

This post was last modified on December 31, 2023 1:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

46 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago