వైసీపీలో ఇదో కొత్తరాగం. వస్తాడు నారాజు ఈ రోజు.. అంటూ కీలక నేత కోసం పార్టీ ఎదురు చూస్తోందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఎన్నికల సమయంలో ఉన్న నాయకులకే టికెట్లు సర్దలేక.. అందరి నీ సంతృప్తి పరచలేక పార్టీ సతమతం అవుతున్నదన్న విషయం వాస్తవం. కానీ, ఇదే సమయంలో కొత్త నాయకుడు, పైగా ఒక సామాజిక వర్గాన్నిప్రభావితం చేయగల నాయకుడు అనే పేరున్న కీలక నేత కోసం వైసీపీ ఎదురు చూస్తున్నట్టు ప్రచారంలో ఉంది.
ఆయనే కాపు నాయకుడు, వారి రిజర్వేషన్ కోసం ఉద్యమించిన కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనా భం. ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని.. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చర్చకు వచ్చింది. అయితే.. ఆయన సైలెంట్ అయ్యారు. ఇక, ఇటీవల కాలంలో ఆయన వైసీపీకి అనుకూలంగా ప్రత్యక్ష ప్రకటనలు చేయకపోయినా.. అనుకూలంగా మాత్రం ఉన్నారనేది టాక్.
మరోవైపు.. కాపు నాయకుల్లోనూ ఆయన బలంగానే ఉన్నారు. గత ఎన్నికల్లోతెరచాటున వైసీపీకి అనుకూ లంగా వ్యవహరించారనే టాక్ ఉండనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని.. వైసీపీ కొంతకాలంగా ఆయనను కోరుతున్నట్టు తెలిసింది. దీనిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. అయితే..ఈ వారంలోగాఏదో ఒకటి తేల్చాలని పార్టీవైపు నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం.
దీంతో ఏ క్షణమైనా.. ముద్రగడ వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని.. ఇటు తాడేపల్లి, అటు తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈయన కోరితే..ఎక్కడ నుంచి ఏ సీటునైనా.. అది అసెంబ్లీ, పార్లమెంటు కావొచ్చు.. దేనినైనా ఇచ్చేందుకు జగన్సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు.. కాపు నాయకులను ఆకర్షించేందుకు, ప్రధానంగా జనసేనకు చెక్ పెట్టేందుకు ముద్రగడ వంటిబలమైన నాయకుల కోసం ఎన్నిరోజులైనా వెయిట్చేయాలనిచూస్తున్నట్టు సమాచారం. మరి ఆయన ఎప్పుడు వస్తారో చూడాలి.
పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి…
వైసీపీ గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది. దీనికి కారణాలు ఏంటన్నవి అందరికీ తెలిసినా..…
కమెడియన్ పాత్రలు చేసుకునే సత్యం రాజేష్ను హీరోగా పెట్టి చాలా తక్కువ బడ్జెట్లో ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా తీశాడు…
తెలంగాణకు కీలక ప్రాజెక్టుగా రానున్న బుల్లెట్ రైలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనుంది. మొత్తం మూడు బుల్లెట్ రైళ్లను కేంద్ర…
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…