Political News

పవన్ త్యాగరాజు, త్యాగాల రాజు – జగన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ టార్గెట్‌గా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. త్యాగాల త్యాగ‌రాజు.. అంటూ ప‌వ‌న్‌కు కొత్త పేరు పెట్టారు. “ఎక్క‌డ సీటిచ్చినా.. ఓకే అంటారు. అస‌లు ఇవ్వ‌క పోయినా.. ఓకే అంటారు. పొరుగు పార్టీ అధికారంలోకి వ‌స్తే అదే వంద కోట్లు అన్న‌ట్టుగా ఫీల‌వుతారు. పార్టీని బ‌లోపేతం చేయ‌క‌పోయినా.. ప‌క్క పార్టీ నేత సీఎం అయితే.. అదే చాలంటారు. ఆయ‌న త్యాగాల త్యాగ‌రాజు” అని ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజాగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. విద్యాదీవెన ప‌థకం కింద ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధుల‌ను విద్యార్థుల ఖాతాల్లో జ‌మ చేశారు. అనంత‌రం.. ఆయ‌న మాట్లాడుతూ.. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌పక్షంపై నిప్పులు చెరిగారు. వంచ‌న‌-మోసాల‌నే వీరు న‌మ్ముకున్నారని, చేసింది చెప్పుకొని ఓటు అడిగే ప‌రిస్థితి ఈ పార్టీల‌కు లేద‌ని జ‌గ‌న్ అన్నారు. నాలుగేళ్ల‌కు ఒక‌సారి పెళ్లి చేసుకోవ‌డం.. విడాకులు ఇవ్వ‌డం.. మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం.. ద‌త్త‌పుత్రుడి దిన‌చ‌ర్య అని విమ‌ర్శించారు.

భీమ‌వ‌రం ప్ర‌జ‌లు ఓడించిన ద‌త్త‌పుత్ర‌డు పొరుగు రాష్ట్రంలో ఉంటార‌ని జ‌గ‌న్ చెన్నారు. ప్ర‌జ‌ల కోసం త్యాగాలు చేసేవారిని చూశామ‌ని, కానీ, ప్యాకేజీల కోసం సొంత పార్టీ, సొంత నేత‌ల‌ను కూడా త్యాగాలు చేసే వారిని గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారని.. ఇలాంటి వారికి ఓటేస్తే.. మోసం చేయ‌డం త‌ప్ప మంచి చేయ‌డం వారికి రాద‌న్నారు. సంక్షేమం అనే పెద్ద గీత‌ను చెరిపేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

నాలుగేళ్ల కోసారి పెళ్లిళ్లు చేసుకునే వారిని, ఒక్క భార్య‌తో కూడా మూడేళ్లు క‌ల‌సి కాపురం చేయ‌నివారిని గెలిపిస్తే.. మ‌న ఆడ‌బిడ్డ‌ల ప‌రిస్థితి ఏంట‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఇలాంటి వారికి ఓటేయ‌డం ధ‌ర్మ మేనా? అని అన్నారు. “మేం అమ్మ ఒడి అమ‌లు చేశాం. అర్హులైన మ‌హిళ‌ల‌కు ఇంటి పట్టా ఇచ్చాం. ఇల్లు క‌ట్టుకునేందుకు ఆర్థిక సాయం చేశాం. ఇంత క‌న్నా మంచి ప‌నిచేశామ‌ని చెప్పుకొనే ధైర్యం ఉంటే.. వారు(టీడీపీ-జ‌న‌సేన‌) ఓటు అడ‌గొచ్చు” అని జ‌గ‌న్ అన్నారు.

This post was last modified on December 29, 2023 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago