Political News

అనుకున్నంతా జరిగిందా ? ఘోర ఓటమి

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనుకున్నంతా జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఘోరంగా ఓడిపోయింది. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని చాలా రోజులు టీబీజీకేఎస్ ఊగిసలాడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభావం తప్పకుండా సింగరేణి ఎన్నికలపైన కూడా పడుతుందని కేసీయార్ భావించారు. సింగరేణి ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని భయపడ్డారు. అందుకనే సింగరేణి ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు కూతురు కవిత ద్వారా ప్రకటన చేయించారు.

అయితే తెరవెనుక ఏమైందో ఏమో 24 గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. సింగరేణి ఎన్నికల్లో అనుబంధం సంఘం పోటీ చేస్తుందని ప్రకటించారు. ప్రకటించినట్లే టీబీజీకేఎస్ సింగరేణి గనులకు సంబంధించిన 11 ఏరియాల్లోను పోటీచేసింది. అయితే ఏ ఏనియాలో కూడా గెలవలేదు. మొత్తం 11 ఏరియాల్లో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయుసీ 5 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్ టీయుసీ 6 చోట్ల గెలిచింది. అయితే వచ్చిన ఓట్ల ప్రాతిపదికగా ఏఐటీయూసీనే సింగరేణి మేనేజ్మెంట్ గుర్తింపు సంఘంగా ప్రకటించింది.

ఏఐటీయూసీ కన్నా ఐఎన్ టీయూసీ ఒక ఏరియా అధికంగా గెలిచింది. అయితే ఐఎన్ టీయూసీ గెలిచిన ఏరియాలన్నీ చిన్నవి కావటంతో కాంగ్రెస్ అనుబంధ సంఘానికి పడిన ఓట్లు కూడా తక్కువే. ఐఎన్టీయూసి గెలిచిన ఏరియాలు కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి, ఆర్డీ 3, కార్పొరేషన్లలో పడిన ఓట్లు తక్కువ. ఇదే సమయంలో ఏఐటీయూసీకి బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, ఆర్డీ 1, ఆర్డీ2 ఏరియాల్లో పోలైన ఓట్లు ఎక్కువ. పోలైన ఓట్ల ప్రాతిపదికగా ఏఐటీయూసీనే యాజమాన్యం గుర్తింపు సంఘంగా ప్రకటించింది.

ఇక్కడ గమనించాల్సిన ఏమిటంటే ఐఎన్టీయూసీ గెలిస్తే కాంగ్రెస్ బలపడుతుందన్న ఆలోచనతో టీబీజీకేఎస్ కూడా ఏఐటీయూసీకే ఓట్లే వేయించిందట. అంటే సీపీఐ అనుబంధ సంఘంను గెలిపించేందుకు బీఆర్ఎస్ అనుబంధం సంఘం సూసైడ్ పద్దతిని అవలంభించిందని అర్ధమైపోతోంది. అయితే బీఆర్ఎస్ అనుబంధం సంఘం మరచిపోయిన విషయం ఏమిటంటే కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తుందని. అవసరమైతే రెండు యూనియన్లు ఏకతాటిపై నడుస్తాయన్న విషయాన్ని బీఆర్ఎస్ మర్చిపోయినట్లుంది. ఏదేమైనా ముందునుండి అనుమానించినట్లుగానే బీఆర్ఎస్ అనుబంధ సంఘానికి ఘోర ఓటమి అయితే తప్పలేదు.

This post was last modified on December 28, 2023 10:50 am

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

22 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

51 mins ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago