వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయనను ఓడించాలనేది టీడీపీ వ్యూహం. ఎందుకంటే.. కత్తికి కత్తి! అన్న సామెత మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంపై వైసీపీ కన్నేసిన నేపథ్యంలో వైసీపీ అధినేత సొంత నియోజకవర్గంపై టీడీపీ కూడా కన్నే సింది. ఈ నేపథ్యంలో కుదిరితే జగన్ను ఓడించడం.. లేకపోతే మెజారిటీని భారీగా తగ్గించడం అనే టార్గెట్ను నిర్దేశించుకుంది.
ఈనేపథ్యంలో పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్గా బీటెక్ రవిని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు. ప్రస్తుతం ఈయన నియోజకవర్గంలో పాదయాత్రలు, సమస్యలపై అధ్యయనాలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అండగా ఉంటున్నారు. దీంతో బీటెక్ రవి పేరు బాగానే వినిపిస్తోంది. ఇదిలావుంటే.. పులివెందులలో వైఎస్ కుటుంబానికి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకు ఈ దఫా కొన్ని కారణాలతో దూరమయ్యే పరిస్తితి వచ్చింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. తదనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్ ఫ్యామిలీకి సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు.. ఈ సారి టీడీపీకి వేయకపోయినా.. మౌనంగా ఉండనుందనే సమాచారం వస్తోంది.
ఈ పరిణామాలకు తోడు.. వైఎస్ సునీత పట్ల సానుభూతి కూడా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామాలన్నీ కూడా.. బీటెక్ రవికి కలిసి వచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇది ఆయన కు గెలుపును అందిస్తుందా.. ? లేదా.. అనేది పక్కన పెడితే.. గత ఎన్నికల్లో వైసీపీ కి ఇక్కడ వచ్చిన మెజారిటీ మాత్రం ఈ దఫా భారీగా తగ్గనుందని టీడీపీ ఒక అంచనాకు వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 27, 2023 6:42 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…