Political News

వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేరు రాష్ట్ర రాజకీయాలలో కొంతకాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక, వైసీపీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చినట్లు పుకార్ల వ్యాపించాయి. అయితే, విశాఖ ప్రజలు తనను అభిమానిస్తున్నారని, ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతానని ఆయన గతంలో ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఆ పుకార్లకు చెక్ పెడుతూ తాజాగా జేడీ లక్ష్మీనారాయణ సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. తన పార్టీ పేరు ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని అన్నారు. ఐపీఎస్ కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రజా సేవకు వచ్చానని, ప్రజలను కలిసి వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని అన్నారు. అయితే, ప్రజా సేవ చేయాలంటే రాజ్యాధికారం ముఖ్యమని గుర్తించానని, ఆ రకంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి 3 లక్షల మంది ఓటర్లు మద్దతు సంపాదించానని చెప్పారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజలందరికీ తెలుసని, రాజకీయాలంటే మోసగించడం కాదు…సుపరిపాలన అని చెప్పేందుకే ఈ పార్టీ పెట్టానని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ఏ పార్టీ మాట్లాడడం లేదని, హోదా వచ్చుంటే రాష్ట్రంలో ఇంత నిరుద్యోగం ఉండేది కాదని అన్నారు.ఒకరు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నారని, మరొకరు కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని అన్నారని, ఇంకొకరు తలలు తెగిపడినా పోరాడతామని ఇంకొకరు అన్నారని చంద్రబాబు, జగన్, పవన్ లపై షాకింగ్ కామెంట్లు చేశారు.

ఎన్నికల ముందు హోదా కోసం పోరాడతామంటూ చెప్పబోతున్నారని, ఆ తరహా మాటలకు ముగింపు పలికి హోదా తెచ్చేందుకు పుట్టిన పార్టీ… జై భారత్ నేషనల్ పార్టీ అని అన్నారు. ఎవరికీ తలవంచబోమని, ఎవరికీ సాష్టాంగ ప్రమాణాలు చేసేదిలేదని అన్నారు. ఎవరూ తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ ఇదని అన్నారు. అవినీతిని అంతమొందించి, ఎవరూ ఒక్క రూపాయిని కూడా తినలేని విధంగా చేసే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపిస్తామన్నారు.

మేధావులను, ఆర్థికవేత్తలను ఉక్కు పాదాల కింద తొక్కుతున్న పరిస్థితి చూస్తున్నామని, సామాజిక బాధ్యతతో సునిశిత విమర్శలు చేస్తున్నవారిని జైళ్లకు పంపిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు, మానవ హక్కుల రక్షణ సజావుగా ఉంటే ఈ పార్టీ పుట్టేది కాదన్నారు.

This post was last modified on December 23, 2023 6:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

9 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

27 minutes ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

51 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

57 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

1 hour ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago