జనసేన పార్టీలో చేరికల వ్యవహారం పుంజుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తు న్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఆశించిన మేరకైనా.. గౌరవప్రదమైన స్థానా ల్లో విజయం దక్కించుకునేలా చేయాలని జనసేన అధినేత ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జిల్లాల పర్యటన చేస్తున్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. చేరికలపైనా దృష్టి పెట్టారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించిన నాగబాబు.. ఆ ఒక్క జిల్లాకే పరిమితం కాకుండా.. తనను కలిసేందుకు వచ్చిన వారితోనూ భేటీ అవుతున్నారు. ఇదే పార్టీలో జోష్ నింపుతోంది. ఇక, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి.. తాజాగా నాగబాబుతో చర్చించడం రాజకీయాలలో ఆసక్తిని రేపింది. ప్రస్తుతం వైసీపీలో ఉండీ ఉండనట్టుగా ఉన్న యలమంచిలి రవి.. గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నారు.
దీనికి ముందు ప్రజారాజ్యం తరఫున 2009లో విజయం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు మాత్రం వైసీపీలో ఉన్నా.. ఆయనకు టికెట్ దక్కక పోతుండడంతో మౌనంగా ఉన్నారు. కమ్మ వర్గానికి చెందిన నాయకుడు కావడం.. తూర్పులో కమ్మ ఓట్లకు ప్రాధాన్యం ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీ చేయాలనే వ్యూహంతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇక, జనసేనలోకి ఎప్పుడు చేరుతారనేది ఇతమిత్థంగా తెలియక పోయినా.. ప్రస్తుతం జనసేన మాత్రం తూర్పు నియోజకవర్గం కావాలని.. పొత్తులో భాగంగా టీడీపీతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఇది.. టీడీపీ వదులుకున్నా.. విజయవాడ తూర్పు నుంచి ఖచ్చితంగా కమ్మ సామాజికవ ర్గానికి చెందిన నాయ కుడికే కేటాయించాల్సి ఉంటుంది. దీంతో జనసేనలో రవోదయం ఖాయమనే చర్చ ఊపందుకుంది. ఇదే జరిగి..జనసేన తరఫున రవి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే.. జనసేనలో ఈ సీటు ఖాయంగా పడుతుందని అంటున్నారు పరిశీలకులు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…