Political News

ఇదే జ‌రిగితే.. జ‌న‌సేన బోణీ ఖాయం…!

జ‌న‌సేన పార్టీలో చేరికల వ్య‌వ‌హారం పుంజుకునేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించేలా క‌నిపిస్తు న్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని ఆశించిన మేర‌కైనా.. గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానా ల్లో విజ‌యం ద‌క్కించుకునేలా చేయాల‌ని జ‌న‌సేన అధినేత ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా జిల్లాల ప‌ర్య‌ట‌న చేస్తున్న జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు.. చేరిక‌ల‌పైనా దృష్టి పెట్టారు.

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో పర్య‌టించిన నాగ‌బాబు.. ఆ ఒక్క జిల్లాకే ప‌రిమితం కాకుండా.. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన వారితోనూ భేటీ అవుతున్నారు. ఇదే పార్టీలో జోష్ నింపుతోంది. ఇక‌, విజ‌య‌వాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి.. తాజాగా నాగ‌బాబుతో చ‌ర్చించ‌డం రాజ‌కీయాల‌లో ఆస‌క్తిని రేపింది. ప్ర‌స్తుతం వైసీపీలో ఉండీ ఉండ‌న‌ట్టుగా ఉన్న య‌ల‌మంచిలి ర‌వి.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో ఉన్నారు.

దీనికి ముందు ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున 2009లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు మాత్రం వైసీపీలో ఉన్నా.. ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌క పోతుండ‌డంతో మౌనంగా ఉన్నారు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం.. తూర్పులో క‌మ్మ ఓట్ల‌కు ప్రాధాన్యం ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేయాల‌నే వ్యూహంతో ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఇక‌, జ‌న‌సేన‌లోకి ఎప్పుడు చేరుతార‌నేది ఇత‌మిత్థంగా తెలియక పోయినా.. ప్ర‌స్తుతం జ‌న‌సేన మాత్రం తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కావాల‌ని.. పొత్తులో భాగంగా టీడీపీతో మంత‌నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇది.. టీడీపీ వ‌దులుకున్నా.. విజ‌య‌వాడ తూర్పు నుంచి ఖ‌చ్చితంగా క‌మ్మ సామాజిక‌వ ర్గానికి చెందిన నాయ కుడికే కేటాయించాల్సి ఉంటుంది. దీంతో జ‌న‌సేన‌లో ర‌వోద‌యం ఖాయ‌మ‌నే చ‌ర్చ ఊపందుకుంది. ఇదే జ‌రిగి..జ‌న‌సేన త‌ర‌ఫున ర‌వి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. జ‌న‌సేన‌లో ఈ సీటు ఖాయంగా ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 21, 2023 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago