ఈ నెల 21న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్ కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేద, బడుగు బలహీన వర్గాలకు జగన్ అండగా నిలుస్తున్న థీమ్ తో రూపొందించిన ఒక ఇల్యూషనల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరి మధ్యలో జగన్ కూర్చొని ఉన్న ఫొటో ట్రెండ్ అవుతోంది.
పచ్చని పంట పొలాలు ఒకవైపు…కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా రూపుదిద్దుకున్న ప్రభుత్వ పాఠశాలలు మరోవైపు…ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకవైపు….గ్రామ, వార్డు సచివాలయాలు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లు మరోవైపు ఉన్న ఫోటో ట్రెండింగ్ లో ఉంది. ఇలా, పిల్లల మొదలు పెద్దల వరకు అన్ని వర్గాలను సంతోష పెడుతున్న జగన్ వారి మధ్యలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తుంటే అది చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు గోతికాడ నక్కల్లా చూస్తున్న రీతిలో రూపుదిద్దిన ఈ ఫోటో వైసీపీ నేతలు, కార్యకర్తలను విపరీతంగా ఆకట్టుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పట్టేలా రూపొందించిన ఈ ఫోటోలు, ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి. అందుకే వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ ఫోన్లలో వాట్సప్ ప్రొఫైల్ పిక్ గా, వాట్సప్ స్టేటస్ లలో, సోషల్ మీడియా ఖాతాల డీపీగా ఈ ఫోటోను పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా రేపు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ థీమ్ ఫ్లెక్సీలు ఊరూవాడా వెలిశాయి. పల్లెలతో పాటు పట్టణాలలో కూడా వైసీపీ నేతలు భారీ సంఖ్యలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఎక్కడ చూసినా ఈ ఫోటో ఈ థీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
This post was last modified on December 20, 2023 5:31 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…