ఈ నెల 21న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్ కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేద, బడుగు బలహీన వర్గాలకు జగన్ అండగా నిలుస్తున్న థీమ్ తో రూపొందించిన ఒక ఇల్యూషనల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరి మధ్యలో జగన్ కూర్చొని ఉన్న ఫొటో ట్రెండ్ అవుతోంది.
పచ్చని పంట పొలాలు ఒకవైపు…కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా రూపుదిద్దుకున్న ప్రభుత్వ పాఠశాలలు మరోవైపు…ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకవైపు….గ్రామ, వార్డు సచివాలయాలు, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లు మరోవైపు ఉన్న ఫోటో ట్రెండింగ్ లో ఉంది. ఇలా, పిల్లల మొదలు పెద్దల వరకు అన్ని వర్గాలను సంతోష పెడుతున్న జగన్ వారి మధ్యలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తుంటే అది చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు గోతికాడ నక్కల్లా చూస్తున్న రీతిలో రూపుదిద్దిన ఈ ఫోటో వైసీపీ నేతలు, కార్యకర్తలను విపరీతంగా ఆకట్టుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పట్టేలా రూపొందించిన ఈ ఫోటోలు, ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి. అందుకే వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ ఫోన్లలో వాట్సప్ ప్రొఫైల్ పిక్ గా, వాట్సప్ స్టేటస్ లలో, సోషల్ మీడియా ఖాతాల డీపీగా ఈ ఫోటోను పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా రేపు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ థీమ్ ఫ్లెక్సీలు ఊరూవాడా వెలిశాయి. పల్లెలతో పాటు పట్టణాలలో కూడా వైసీపీ నేతలు భారీ సంఖ్యలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఎక్కడ చూసినా ఈ ఫోటో ఈ థీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు.
This post was last modified on December 20, 2023 5:31 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…