తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. మెదక్ పార్లమెంటు నుండి పోటీచేస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్సే గెలిచింది. అందుకనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాలని కేసీయార్ అనుకుంటున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీగా కేసీయార్ ఎన్నికైన విషయం తెలిసిందే.
అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేసీయార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండగా రేవంత్ విషయంలో కేసీయార్ ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో రేవంత్ ను కేసీయార్ అసలు నోరెత్తనీయలేదు. ఎప్పుడు మాట్లాడేందుకు ప్రయత్నించినా మైక్ కట్ చేయటం లేదా సభ నుండి బయటకు పంపేయటమే మార్గంగా కేసీయార్ ఎంచుకున్నారు. చివరకు నెలరోజుల పాటు రేవంత్ ను సభ నుండి సస్పెండ్ కూడా చేయించారు.
వాటన్నింటినీ రేవంత్ ఎప్పటికీ మరచిపోరు. ఎందుకంటే ఇపుడు జరగుతన్నదంతా రివేంజ్ పాలిటిక్సనే చెప్పాలి. బదులుకు బదులు తీర్చేయటమే పాలిటిక్స్ లో కొత్త ట్రెండుగా నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇపుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరే ఇందుకు నిదర్శనంగా కనబడుతోంది. సభలో బూతులు తిట్టుకోవటం లేదు కానీ మిగిలినవన్నీ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే బీఆర్ఎస్ ఇంకా అధికారంలోనే ఉందన్నట్లుగా కేటీయార్, హరీష్ రావులు మాట్లాడుతున్న విధానమే.
ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లుగానే ఎప్పటిదో ఇందిరాగాంధీ పరిపాలనను విమర్శించటం, కర్నాటక ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేయటం ఎందుకో కేటీయార్, హరీష్ కే తెలియాలి. తెలంగాణాలో ప్రస్తుతానికి ఏమాత్రం ఉపయోగంలేని ఇందిరాగాంధి పాలనను ప్రస్తావిస్తున్న కారణంగానే రేవంత్, మంత్రులు కేటీయార్, హరీష్ ను వాయించేస్తున్నారు. తెలంగాణాలో ప్రస్తుత దరిద్రానికి కేసీయార్ పరిపాలనే కారణమని రేవంత్ అండ్ కో ఎదురుదాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీయార్ సభకు వచ్చి రేవంత్ ను ఫేస్ చేయటం కష్టమే. అందుకనే రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేసి కేంద్రానికి వెళ్ళిపోవాలని అనుకున్నారట.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…