తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. మెదక్ పార్లమెంటు నుండి పోటీచేస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ బలంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్సే గెలిచింది. అందుకనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాలని కేసీయార్ అనుకుంటున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఎల్పీగా కేసీయార్ ఎన్నికైన విషయం తెలిసిందే.
అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేసీయార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండగా రేవంత్ విషయంలో కేసీయార్ ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో రేవంత్ ను కేసీయార్ అసలు నోరెత్తనీయలేదు. ఎప్పుడు మాట్లాడేందుకు ప్రయత్నించినా మైక్ కట్ చేయటం లేదా సభ నుండి బయటకు పంపేయటమే మార్గంగా కేసీయార్ ఎంచుకున్నారు. చివరకు నెలరోజుల పాటు రేవంత్ ను సభ నుండి సస్పెండ్ కూడా చేయించారు.
వాటన్నింటినీ రేవంత్ ఎప్పటికీ మరచిపోరు. ఎందుకంటే ఇపుడు జరగుతన్నదంతా రివేంజ్ పాలిటిక్సనే చెప్పాలి. బదులుకు బదులు తీర్చేయటమే పాలిటిక్స్ లో కొత్త ట్రెండుగా నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇపుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల తీరే ఇందుకు నిదర్శనంగా కనబడుతోంది. సభలో బూతులు తిట్టుకోవటం లేదు కానీ మిగిలినవన్నీ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే బీఆర్ఎస్ ఇంకా అధికారంలోనే ఉందన్నట్లుగా కేటీయార్, హరీష్ రావులు మాట్లాడుతున్న విధానమే.
ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్లుగానే ఎప్పటిదో ఇందిరాగాంధీ పరిపాలనను విమర్శించటం, కర్నాటక ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేయటం ఎందుకో కేటీయార్, హరీష్ కే తెలియాలి. తెలంగాణాలో ప్రస్తుతానికి ఏమాత్రం ఉపయోగంలేని ఇందిరాగాంధి పాలనను ప్రస్తావిస్తున్న కారణంగానే రేవంత్, మంత్రులు కేటీయార్, హరీష్ ను వాయించేస్తున్నారు. తెలంగాణాలో ప్రస్తుత దరిద్రానికి కేసీయార్ పరిపాలనే కారణమని రేవంత్ అండ్ కో ఎదురుదాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీయార్ సభకు వచ్చి రేవంత్ ను ఫేస్ చేయటం కష్టమే. అందుకనే రాబోయే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేసి కేంద్రానికి వెళ్ళిపోవాలని అనుకున్నారట.
This post was last modified on December 20, 2023 2:40 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…