Political News

టికెట్ లేదా..? నిజమేనా రోజా?

ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు షాక్ తప్పదా? వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

వరుసగా రెండు సార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజాకు గడ్డు కాలం పొంచి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో ప్రజలు, సొంత పార్టీ నాయకుల నుంచి రోజాపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటమే అందుకు కారణమని చెబుతున్నారు.

వచ్చే ఏడాది ఎన్నికలు జగన్ అత్యంత కీలకమైనవి. వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న జగన్ విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల మేరకు నియోజకవర్గాల ఇంఛార్జీలను మారుస్తున్నారు. గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో పరిస్థితి నేపథ్యంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని టాక్. నగరిలో రోజా పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని అంటున్నారు.

మరోవైపు రోజాకు వ్యతిరేకంగా అక్కడ వైసీపీలో మరో గ్రూప్ బలంగా మారుతోంది. ఈ వ్యతిరేక గ్రూప్ జగన్ తో టచ్లో ఉంటున్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతుందని జగన్ కు వీళ్లు చెప్పారని తెలిసింది. అంతే కాకుండా సర్వేల్లో కూడా రోజాకు మైనస్ మార్కులే వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో రోజాకు టికెట్ ఇవ్వొద్దని జగన్ అనుకుంటున్నారని తెలిసింది. ఎమ్మెల్సీ హామీనిచ్చి ఆమెను ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవాలని జగన్ అనుకుంటున్నారని టాక్. మరి రోజా దీనిపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

This post was last modified on December 17, 2023 10:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago