ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉన్నా, ప్రమోషన్ల విషయంలో హోంబాలే ఫిలింస్ ఎలాంటి దూకుడు చూపించకపోయినా ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న సలార్ జ్వరం మూవీ లవర్స్ ని అమాంతం కమ్మేస్తోంది. పరిమిత లొకేషన్లతో కర్ణాటక, కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఇప్పటికే చెరో కోటి రూపాయలు దాటేసింది. ఇంకా చాలా థియేటర్లు జోడించే పనిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణలో అధికారిక జిఓలు వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే. అవి వచ్చిన మరుక్షణం ఆన్ లైన్ అమ్మకాలు ఊపందుకుంటాయి. ఓవర్సీస్ లో కేవలం నాలుగు మార్కెట్ల నుంచే ఒకటిన్నర మిలియన్ వసూలు చేయడం చిన్న విషయం కాదు.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ సాధ్యమేనా అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ప్రభాస్ కు ఆ సత్తా ఉందని, ఒక ప్యాన్ ఇండియా మూవీకి జరగాల్సిన హడావిడి కనిపించకపోయినా కంటెంట్ మీద నమ్మకంతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడని అంటున్నారు. రెండు మూడు షోలయ్యాక వచ్చే టాక్ తో ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు. షారుఖ్ డంకీ, ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డం వల్ల ఫస్ట్ డేకే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సుల స్క్రీన్లు పంచుకోవాల్సి రావడం సలార్ కున్న అతి పెద్ద అడ్డంకి.
ఇవాళ విడుదల చేయబోతున్న రాజమౌళితో చేయించిన స్పెషల్ ఇంటర్వ్యూలో చాలా సంగతులు ఉంటాయని, దాన్ని చూశాక ఒక్కసారిగా అంచనాల్లో మార్పు వస్తుందని లెక్కలేస్తున్నారు. కొత్త ట్రైలర్ కూడా హైప్ పెంచేలా ఉంటుందట. ఒకవేళ సలార్ కనక వంద కోట్ల మైలురాయి డిసెంబర్ 22నే అందుకుంటే బాహబలి 2, ఆదిపురుష్, సాహో తర్వాత ఆ ఘనత సాధించినట్టు అవుతుంది. ప్రభాస్ కు మాత్రమే సాధ్యమయ్యే మైలురాయిగా ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలుగు వెర్షన్ బుకింగ్స్ మొదలయ్యాక జరిగే రచ్చ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.
This post was last modified on December 18, 2023 10:36 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…