ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉన్నా, ప్రమోషన్ల విషయంలో హోంబాలే ఫిలింస్ ఎలాంటి దూకుడు చూపించకపోయినా ఇంకో అయిదు రోజుల్లో విడుదల కాబోతున్న సలార్ జ్వరం మూవీ లవర్స్ ని అమాంతం కమ్మేస్తోంది. పరిమిత లొకేషన్లతో కర్ణాటక, కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఇప్పటికే చెరో కోటి రూపాయలు దాటేసింది. ఇంకా చాలా థియేటర్లు జోడించే పనిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణలో అధికారిక జిఓలు వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే. అవి వచ్చిన మరుక్షణం ఆన్ లైన్ అమ్మకాలు ఊపందుకుంటాయి. ఓవర్సీస్ లో కేవలం నాలుగు మార్కెట్ల నుంచే ఒకటిన్నర మిలియన్ వసూలు చేయడం చిన్న విషయం కాదు.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ సాధ్యమేనా అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. ప్రభాస్ కు ఆ సత్తా ఉందని, ఒక ప్యాన్ ఇండియా మూవీకి జరగాల్సిన హడావిడి కనిపించకపోయినా కంటెంట్ మీద నమ్మకంతోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడని అంటున్నారు. రెండు మూడు షోలయ్యాక వచ్చే టాక్ తో ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు. షారుఖ్ డంకీ, ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డం వల్ల ఫస్ట్ డేకే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సుల స్క్రీన్లు పంచుకోవాల్సి రావడం సలార్ కున్న అతి పెద్ద అడ్డంకి.
ఇవాళ విడుదల చేయబోతున్న రాజమౌళితో చేయించిన స్పెషల్ ఇంటర్వ్యూలో చాలా సంగతులు ఉంటాయని, దాన్ని చూశాక ఒక్కసారిగా అంచనాల్లో మార్పు వస్తుందని లెక్కలేస్తున్నారు. కొత్త ట్రైలర్ కూడా హైప్ పెంచేలా ఉంటుందట. ఒకవేళ సలార్ కనక వంద కోట్ల మైలురాయి డిసెంబర్ 22నే అందుకుంటే బాహబలి 2, ఆదిపురుష్, సాహో తర్వాత ఆ ఘనత సాధించినట్టు అవుతుంది. ప్రభాస్ కు మాత్రమే సాధ్యమయ్యే మైలురాయిగా ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలుగు వెర్షన్ బుకింగ్స్ మొదలయ్యాక జరిగే రచ్చ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…