రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గతంలో మాదిరిగా కేవలం జెండా మోసి బతికేసే నాయకులు.. అధినేత ఏది ఇస్తే అది తీసుకుని సర్దేసుకునే నాయకులు ఇప్పుడు లేరు. ఇప్పుడంతా.. మా కేంటి? అనే టైపులోనే రాజకీయాలు సాగుతున్నాయి. దీనికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. పాతతరం నాయకులు అయితే.. ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో వచ్చిన జీతాన్ని కూడా పార్టీకి ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. నడుచుకుంటూ చట్ట సభలకు వెళ్లిన వారు కూడా ఉన్నారు.
కానీ, తరం మారిపోయింది.. తరాలు మారిపోయాయి. నాయకుల అభిరుచులు కూడా మారుతున్నాయి. మా మేలు.. ముఖ్యం .. మా సీటు ముఖ్యం.. మా హవా ముఖ్యం.. అనే నాయకులు పెరుగుతున్నారు. ఎందెందు వెతికినా.. ఇలాంటి నాయకులే కనిపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కదని భావించిన వారు.. నామినేషన్లకు ముందు రోజు వరకు కూడా మారుతూనే ఉన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు కూడా జంపింగ్ చేసేశారు.
సో.. మొత్తానికి తరంతోపాటు నాయకుల స్వరం కూడా మారుతోంది. ఇక, ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ట పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంది. వైసీపీ గెలుపు గుర్రాలు.. బీసీలు.. ప్రజాభిమానం.. గ్రాఫ్ అంటూ.. నాలుగునియమాలు పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇక, టీడీపీ-జనసేనతో పొత్తు పెట్టుకుని.. వచ్చే ఎన్నికల్లో గెలిచేవారకే టికెట్లు అని ఏకైక ఫార్ములాతో ముందుకు సాగుతోంది.
దీంతో ఇరు పార్టీల్లోనూ కొందరికి టికెట్లు దక్కొచ్చు.. దక్కకపోవచ్చు. ఈ విషయంపైనే నాయకులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ వారికి పార్టీలతో పనిలేదు. కేవలం టికెట్లతోనే పని. తమకు ఇస్తే సరే.. లేకుంటే ఒంటరిగా అయినా.. పోటీ చేయాలనేది నాయకుల వ్యూహం. అంతేకాదు.. తాము ఓడినా..తమను కాదన్న పార్టీని ఓడించడంకూడా..ఇప్పుడు వీరి లక్ష్యంగా మారింది. తెలంగాణలోని సుమారు 15 నియోజకవర్గాల్లో ఇదే వ్యూహంఫలించి.. అక్కడ బీఆర్ ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో నాయకులు ఆలోచనలో ఉండడం గమనార్హం.
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…