వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం.. నాయకులు జిల్లాలు సైతం మారిపోతున్నారు. కొందరు నియోజకవర్గాలను మారుతుంటే.. ఇప్పుడు ఉన్న పోటీ నేపథ్యంలో మరికొందరు జిల్లాలను కూడా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో టీడీపీ, వైసీపీ నాయకుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా టీడీపీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. తాడికొండ ప్రస్తుత ఎమ్మెల్యే.. వైసీపీ రెబల్ నాయకురాలు.. ఉండవల్లి శ్రీదేవి.. తిరువూరు నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవి 2014 ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంతకుముందు.. ఆమె కుటుంబం కూడా రాజకీయాలు చేసింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉండవల్లి.. విజయం దక్కించుకున్నారు. అయితే, తర్వాత పరిణామాల నేపథ్యంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి అనుకూలంగా ఓటేశారనే ఆరోపణలు వచ్చాయి.
దీంతో వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక, ఆ తర్వాత ఆమె నేరుగా టీడీపీకి మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన ఆందోళన ల్లోనూ ఆమె పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. అయితే, ఆమె తాడికొండ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఇక్కడ తెనాలి శ్రావణ్కుమార్కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అయింది.
దీంతో ఈ సీటు విషయంలో శ్రీదేవికి నిరాసే ఎదురైంది. అయితే, ఆమెకు ఉన్న చరిష్మా నేపథ్యానికి తోడు మహిళా సెంటిమెంటు, ఉన్నత విద్యావంతురాలనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఉమ్మడి కృష్ణాజిల్లాలోని తిరువూరు కు నామినేట్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడ అయితే, ఆమె గెలుపునకు అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడి కీలక నాయకుడు నల్లగట్ల స్వామిదాసును ఒప్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న దేవదత్ కూడా పార్టీని పటిష్టం చేయలేకపోతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక ఇక్కడ శ్రీదేవిని రంగంలోకి దింపితే అసంతృప్తి లేవకుండా ఉండే బాధ్యతను మాజీ మంత్రి దేవినేని ఉమకు అప్పగించారని.. ఎమ్మెల్సీ సీటు ఇచ్చే ప్రతిపాదన ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on December 16, 2023 8:30 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…