వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం.. నాయకులు జిల్లాలు సైతం మారిపోతున్నారు. కొందరు నియోజకవర్గాలను మారుతుంటే.. ఇప్పుడు ఉన్న పోటీ నేపథ్యంలో మరికొందరు జిల్లాలను కూడా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో టీడీపీ, వైసీపీ నాయకుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా టీడీపీలో జరుగుతున్న చర్చ ప్రకారం.. తాడికొండ ప్రస్తుత ఎమ్మెల్యే.. వైసీపీ రెబల్ నాయకురాలు.. ఉండవల్లి శ్రీదేవి.. తిరువూరు నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవి 2014 ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంతకుముందు.. ఆమె కుటుంబం కూడా రాజకీయాలు చేసింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉండవల్లి.. విజయం దక్కించుకున్నారు. అయితే, తర్వాత పరిణామాల నేపథ్యంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీకి అనుకూలంగా ఓటేశారనే ఆరోపణలు వచ్చాయి.
దీంతో వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక, ఆ తర్వాత ఆమె నేరుగా టీడీపీకి మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన ఆందోళన ల్లోనూ ఆమె పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. అయితే, ఆమె తాడికొండ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఇక్కడ తెనాలి శ్రావణ్కుమార్కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ అయింది.
దీంతో ఈ సీటు విషయంలో శ్రీదేవికి నిరాసే ఎదురైంది. అయితే, ఆమెకు ఉన్న చరిష్మా నేపథ్యానికి తోడు మహిళా సెంటిమెంటు, ఉన్నత విద్యావంతురాలనే అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఆమెను ఉమ్మడి కృష్ణాజిల్లాలోని తిరువూరు కు నామినేట్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడ అయితే, ఆమె గెలుపునకు అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఇక్కడి కీలక నాయకుడు నల్లగట్ల స్వామిదాసును ఒప్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న దేవదత్ కూడా పార్టీని పటిష్టం చేయలేకపోతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక ఇక్కడ శ్రీదేవిని రంగంలోకి దింపితే అసంతృప్తి లేవకుండా ఉండే బాధ్యతను మాజీ మంత్రి దేవినేని ఉమకు అప్పగించారని.. ఎమ్మెల్సీ సీటు ఇచ్చే ప్రతిపాదన ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…